India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అల్లు అర్జున్ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. అభిమానులు థియేటర్కు వచ్చి చనిపోవడం సరికాదని CM అన్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి ధైర్యమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ ఆలోచనతోనే CM మాట్లాడారని.. తాము సినీ ఇండస్ట్రీని భయపెడుతున్నామనే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఘటనను రాజకీయం చేసే వారి గురించి మాట్లాడబోమని చెప్పారు.
TG: తెలంగాణ ఏర్పాటు తర్వాత పీవీ నరసింహారావును BRS ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని కేటీఆర్ అన్నారు. ‘గడ్డు కాలంలో ప్రధానిగా సేవలందించి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారు. ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపాం. ఆయన కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం’ అని పీవీ వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేశారు.
మరో భారతీయ అమెరికన్కు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవిని కట్టబెట్టారు. ఆంత్రప్రెన్యూర్, VC, రచయిత శ్రీరామ్ కృష్ణన్ను AIపై వైట్హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుగా ఎంపిక చేశారు. ‘AI, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అనేక అంశాల విధాన రూపకల్పనలో డేవిడ్ సాక్స్తో కలిసి శ్రీరామ్ కృష్ణన్ పనిచేస్తారు’ అని ట్రంప్ తెలిపారు. మైక్రోసాఫ్ట్, ట్విటర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్లో నాయకత్వ బాధ్యతల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
‘అతి’ అనర్థాలకు దారి తీస్తుందట. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. నిద్ర లేవగానే 4 లీటర్ల నీరు తాగిన ఓ 40ఏళ్ల మహిళ కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలైంది. నీరు తాగిన గంటలోనే హైపోనాట్రేమియా(రక్తంలో సోడియం గాఢత తగ్గడం)తో ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహ కోల్పోగా ICUలో చికిత్స పొందారు. రోజుకు 2.5-3.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించారు.
‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభమైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
స్టైలిష్గా పొడవాటి జుట్టుతో MS ధోనీ 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్పై మ్యాచుతో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్లో ‘0’కే రనౌట్ అయినా, ఆపై అంచెలంచెలుగా ఎదిగి IND మేటి కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2007 T20WC, 2011 వన్డే WC, 2013లో CT సాధించారు. అలాగే IPLలోనూ CSKకు 5 ట్రోఫీలు అందించారు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా IPL ఆడుతూ ఫ్యాన్స్ను అలరిస్తున్నారు.
నటి సన్నీలియోన్ పేరిట అకౌంట్ క్రియేట్ చేసిన ప్రబుద్ధుడు నెలనెలా రూ.1000 పొందుతున్నాడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెళ్లైన మహిళలకు ‘మహతారి వందన్ యోజన’ పేరుతో ప్రతి నెలా అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరేందర్ జోషి ఫేక్ ఖాతాతో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ పథకంలో 50% ఫేక్ అకౌంట్లు ఉన్నాయని BJP సర్కారుపై కాంగ్రెస్ విమర్శించింది.
అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ Xలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 78,682 (+637), నిఫ్టీ 23,773 (+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. SHRIRAMFIN, JSWSTEEL, HDFC BANK టాప్ గెయినర్స్.
TG: నిన్న OU JAC నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం ‘సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా’ అని CM రేవంత్ ట్వీట్ చేశారు. బన్నీ ఇంటిపైనే దాడి జరిగినట్లు స్పష్టమవుతున్నా ఆయన బన్నీ పేరు ప్రస్తావించలేదు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి మాత్రం అర్జున్ పేరుతోనే ట్వీట్ చేశారు. కాగా, అల్లు అర్జున్ పేరును పలికేందుకు CM విముఖత చూపుతున్నారా? దీనిపై మీ COMMENT.
Sorry, no posts matched your criteria.