news

News February 18, 2025

విడదల రజినీకి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News February 18, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

News February 18, 2025

తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

image

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

News February 18, 2025

కేసు వాదిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

image

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరు వేణుగోపాల రావు మరణించారు. ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కోర్టు హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. లాయర్ మృతితో మిగతా కోర్టు హాళ్లలో రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.

News February 18, 2025

ముస్లిం ఉద్యోగులకే పండుగా.. హిందువుల సంగతేంటి?: రాజాసింగ్

image

TG: రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పించడంపై బీజేపీ MLA రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని ట్వీట్ చేశారు. ‘ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ హిందువుల పండుగలను విస్మరించింది. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. లేదంటే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.

News February 18, 2025

వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు జగన్?: పల్లా

image

AP: దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి, దోపిడీదారుడైన YCP నేత వల్లభనేని వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? అని జగన్‌ను ప్రశ్నిస్తూ TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వేధిస్తే.. అతని కంటే మీకు నేరస్థుడు ఎక్కువైపోయాడా?, అసెంబ్లీలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తావు జగన్? అంటూ పలు ప్రశ్నలను సంధించారు.

News February 18, 2025

Stock Markets: భారీ నష్టాల నుంచి తేరుకొని..

image

స్టాక్‌మార్కెట్లు నేడు ఆటుపోట్లకు లోనయ్యాయి. ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు ఆఖరికి కోలుకున్నాయి. నిఫ్టీ 22,945 (-14), సెన్సెక్స్ 75,967 (-29) వద్ద ముగిశాయి. ఐటీ, O&G సూచీలు ఎగిశాయి. రియాల్టి, మెటల్, ఫైనాన్స్ సూచీలు ఫ్లాటుగా ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు విలవిల్లాడాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్.

News February 18, 2025

VVIP చాపర్ కేస్: మధ్యవర్తికి బెయిల్

image

అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కేసులో బ్రిటన్ మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. CBI కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నారని, సప్లిమెంటరీ సహా 3 ఛార్జిషీట్లను CBI దాఖలు చేసిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు నిర్దేశించిన ఆంక్షలకు లోబడి, అనారోగ్య కారణాలతో ఊరటనిచ్చింది.

News February 18, 2025

‘బిచ్చగాడిలా చూశాడు.. అందుకే తాతను చంపేశా’

image

పారిశ్రామికవేత్త, వెల్‌జన్ గ్రూప్ అధినేత జనార్దన్ రావు దారుణ <<15406329>>హత్య<<>> కేసులో HYD పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. తనను తాత బిచ్చగాడిగా చూశాడని, అందుకే విసిగిపోయి చంపేశానని విచారణలో జనార్దన్ రావు మనుమడు కీర్తితేజ తెలిపాడు. ‘మా తాత మిగతావారితో సమానంగా నన్ను చూడలేదు. అందరిముందు హేళన చేసేవాడు. ఆస్తులే కాకుండా, సంస్థలో ఏ పదవీ ఇవ్వలేదు’ అని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

News February 18, 2025

2,734 ఉద్యోగాలు.. గ్రూప్-1,2,3 ఫలితాలపై UPDATE

image

TG: లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1,2,3 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. 563 గ్రూప్-1 పోస్టుల ఫలితాలను TGPSC మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనుందని సమాచారం. ఆ నియామకాలు పూర్తయిన వెంటనే 783 గ్రూప్-2, 1,388 గ్రూప్-3 ఉద్యోగాల ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విభాగాల్లో 2,734 పోస్టులకుగాను 5.51లక్షల మంది పోటీ పడ్డారు.