India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతులకు మేలు చేసేలా BRS సూచనలు చేస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయంటూ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల అంశంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు మాత్రమే సభకు వస్తున్నారని CM ఎద్దేవా చేశారు.
SBI 13,735 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్లో 609 బ్యాక్లాగ్ పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా, JAN 7 వరకు అప్లై చేయవచ్చు. APలో 50, TGలో 342 ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.
TG: సాగులో లేని భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ‘రూ.22వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు అందింది. రోడ్లు వేసిన భూములకూ డబ్బులు పడ్డాయి. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?’ అని అసెంబ్లీలో MLAలను అడిగారు. రైతుభరోసాపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందరికీ ఇస్తాం’ అని వెల్లడించారు.
TG: పొలాలకు వెళ్లే రోడ్ల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కోరారు. ‘పొలానికి ఎరువులు తీసుకెళ్లాలన్నా, కూలీలను తరలించాలన్నా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ప్రస్తుతం ఏ రైతులు సంతోషంగా లేరు. పరిశ్రమలు పెట్టే వాళ్లకు రాయితీలు ఇస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం. రైతుల పిల్లలకు 90% రాయితీతో కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలి’ అని కోరారు.
TG: 194 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదలైంది. 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 2025 ఏప్రిల్ 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. 6వ క్లాసులో అన్ని సీట్లకు, 7-10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే భర్తీ చేస్తారు. SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
కాంగ్రెస్ MP శశిథరూర్కు OGM హర్దీప్పూరీ గట్టి పంచ్ ఇచ్చారు. లండన్లో 2009లో UN అంబాసిడర్గా ఎంపికైనప్పుడు తానిచ్చిన విందుకు జార్జి సొరోస్ సహా అతిథుల జాబితాను ఇచ్చిందే ఆయనని తెలిపారు. కాంగ్రెస్లోని కొందరు మిత్రులు వంచనను ఆర్టిక్యులేట్ చేయడంలో నిష్ణాతులని ఎద్దేవా చేశారు. RG ఫౌండేషన్కు దాత కాబట్టే పేరు రాసిచ్చారని పేపర్లను షేర్ చేశారు. సొరోస్, RGF గురించి తనకేం తెలియదని <<14896129>>థరూర్ <<>>వివరణ ఇచ్చారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ CM కేజ్రీవాల్ను విచారించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ఈడీకి అనుమతినిచ్చారు. ఎక్సైజ్ పాలసీలో భారీ స్థాయి అవినీతిని గుర్తించామని, కేజ్రీని విచారించేందుకు అనుమతించాలని ఈ నెల 5న ఈడీ LGని కోరింది. ‘సౌత్గ్రూప్’తో కలిసి కేజ్రీవాల్ రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారని, కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.
ప్రపంచ అందగాళ్ల జాబితాలో మూడో ప్లేస్లో ఉన్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్గా కనిపిస్తుంటారు. అయితే, హృతిక్ తల్లి పింకీ కూడా ఫిట్నెస్లో ఆయన్ను మించిపోయిందని నెట్టింట చర్చ జరుగుతోంది. 70 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లుగా ఫిట్గా ఉండటాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. జిమ్లో ఇద్దరూ కసరత్తు చేస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి.
TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్హౌస్లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.
కేటీఆర్ చేసిన సవాలుకు మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. 60శాతం గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అన్నారు. ‘నీళ్లు రావట్లేదన్న విషయాన్ని నేను 100శాతం నిరూపిస్తా. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తా. ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేకపోయారు. భూ సమీకరణకు కూడా డబ్బులివ్వలేదు’ అని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.