news

News December 21, 2024

ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా?

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 లీగ్ స్టేజీలో భాగంగా తమ చివరి మ్యాచులో పుణెరి పల్టాన్‌పై తెలుగు టైటాన్స్ 48-36 తేడాతో గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా, ఆరో స్థానం కోసం U ముంబా, టైటాన్స్ మధ్య పోటీ ఉంది. U ముంబాకు ఇంకా 2 లీగ్ మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో ఆ జట్టు భారీ తేడాతో ఓడితేనే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.

News December 21, 2024

చంద్రబాబు గారు విద్యార్థులకు ట్యాబ్‌లు ఎక్కడ?: జగన్

image

AP: తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఏమయ్యాయని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ‘ప్రతి ఏటా రూ.15వేల అమ్మ ఒడి ఏది? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఎక్కడ? విద్యా దీవెన, వసతి దీవెన, 3వ తరగతి నుంచి టోఫెల్, నాడు-నేడు పనులు ఎక్కడ? ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ? తల్లికి వందనం హామీ ఏమైంది? అమ్మ ఒడిని ఈ ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు?’ అని ట్వీట్ చేశారు.

News December 21, 2024

TODAY HEADLINES

image

* KTRను 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దు: హైకోర్టు
* కబ్జాలు చేసే వారి తాట తీస్తాం: చంద్రబాబు
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
* ధరణితో రైతుల సమాచారం విదేశాలకు వెళ్లింది: సీఎం రేవంత్
* భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
* ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్
* బీఆర్ఎస్ పాలనంతా కచరా గవర్నెన్స్: అక్బరుద్దీన్
* కరెంటు దొంగిలించిన సంభల్ MP జియా ఉర్ బర్ఖ్‌కు ₹2 కోట్ల ఫైన్

News December 21, 2024

ఆ జాబితాలో అత్య‌ధికులు గుజ‌రాతీలే

image

<<14937075>>అమెరికా పౌర‌సత్వం<<>> పొందుతున్న వారిలో అత్య‌ధికులు గుజ‌రాతీలు ఉన్న‌ట్టు US Immigration అధికారులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భారతీయలు, ముఖ్యంగా గుజ‌రాతీలు అమెరికాకు శ‌ర‌ణార్థిగా వెళ్తున్నారు. జాతి, మ‌తం, రాజ‌కీయ సిద్ధాంతాల వ‌ల్ల స్వ‌దేశంలో హింస ఎదుర్కొంటున్న శ‌ర‌ణార్థులుగా అమెరికాలో ఆశ్ర‌యం పొందుతున్నారు. అనంత‌రం ప‌త్రాలు లేక‌పోయినా ప‌నిలో చేరి పౌర‌స‌త్వం పొందుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

News December 21, 2024

శీతాకాలంలో తినాల్సిన ఫుడ్ ఇదే..

image

శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. చలికాలంలో బాదం, కాజు, వాల్‌నట్స్, ఖర్జూరాలు తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెయ్యి, తేనె శరీరంలో వేడి పుట్టిస్తాయి. జొన్నలు, రాగులు తీసుకోవడం మంచిది. బెల్లం నువ్వుల లడ్డూ, పసుపు, గుడ్లు, చికెన్ తీసుకుంటే త్వరగా జీర్ణం కాక శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది.

News December 20, 2024

పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!

image

పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువుల‌పై దాడులు అధికంగా జ‌రిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువుల‌పై 112 దాడి ఘ‌ట‌న‌లు జ‌రగ్గా, బంగ్లాలో 2,200 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్ర‌భుత్వం కూలిన త‌రువాత దాడులు పెరిగిన‌ట్టు వెల్ల‌డించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.

News December 20, 2024

ఇలా చేస్తే పిల్లలు పుట్టరు!: రీసెర్చ్

image

* ఫాస్ట్‌ఫుడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహారం తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
* అధిక బరువు పెరిగిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించేందుకు 81% అవకాశముంది.
* ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
* స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది.

News December 20, 2024

రామ్‌చరణ్‌కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ నిర్మిస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరిస్తారు. కాగా ఇప్పటివరకు హీరో ప్రభాస్‌కు కట్టిన 230 అడుగుల కటౌటే దేశంలో అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

News December 20, 2024

శబరిమలకు పోటెత్తిన భక్తులు

image

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96వేలకు పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. మండల పూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. DEC 22 నుంచి రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

News December 20, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది విశాఖకు 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.