news

News February 16, 2025

BREAKING: ఏపీలో తొలి GBS మరణం

image

AP: రాష్ట్రంలో తొలి గులియన్ బార్ సిండ్రోమ్<<15225307>>(GBS)<<>> మరణం నమోదైంది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల తెలంగాణలోనూ సిద్దిపేటకు చెందిన మహిళ <<15405226>>జీబీఎస్<<>> కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.

News February 16, 2025

SRH మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే

image

IPL-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచులు ఆడనుంది. ఇందులో HYDలోనే 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ 23న RRతో HYDలో తలపడనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, తదితర ప్లేయర్లతో SRH శత్రు దుర్భేద్యంగా ఉంది. SRH పూర్తి షెడ్యూల్‌ని పై ఫొటోలో చూడవచ్చు. కాగా, ఈ ఏడాది IPL మార్చి 22న కోల్‌కతాలో ప్రారంభం కానుంది.

News February 16, 2025

IPL-2025: ఏ జట్టుకు ఏ రోజు మ్యాచ్(FULL LIST)

image

ఐపీఎల్ 18వ సీజన్‌ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తం పది టీమ్‌(KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR)లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఏ జట్టు ఏ రోజు ఎవరితో ఏ వేదికలో మ్యాచ్ ఆడనుంది? పూర్తి జాబితాను పై ఫొటోల్లో చూడవచ్చు.

News February 16, 2025

మిస్డ్ కాల్‌కు తిరిగి కాల్ చేస్తే అంతే సంగతులు

image

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.

News February 16, 2025

నీతా అంబానీకి అరుదైన గౌరవం

image

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.

News February 16, 2025

BIG BREAKING: IPL-2025 షెడ్యూల్ వచ్చేసింది

image

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి 65 రోజులపాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్‌ KKR-RCB మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహిస్తారు. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. IPL షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 16, 2025

ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు

image

AP: ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల కూటమి నేతలతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో TDP అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఎన్నికా పరీక్షేనని, అన్నిట్లోనూ గెలవాలని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి పాలనలో స్పష్టమైన మార్పులు తెచ్చామన్నారు.

News February 16, 2025

యువతుల చూపు.. ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వైపు!

image

ప్రస్తుతం చైనా యువతులు ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వెంట పడుతున్నారు. చైనాలో ‘లవ్ అండ్ డీప్ స్పేస్’ అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో 6 మిలియన్ల మంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అమ్మాయిలు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, కాల్స్ చేయడం, వారు ఎంతసేపు మాట్లాడినా ఓపిగ్గా వినడం వంటివి ఏఐ చేస్తుంది. ఈ యాప్ సృష్టికర్త యో రనావో బిలియనీర్ అయిపోయారు.

News February 16, 2025

తిరుమల లడ్డూ వ్యవహారం.. CBNపై సుబ్రమణియన్ విమర్శలు

image

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు తీరుపై బీజేపీ నేత, ప్రముఖ లాయర్ సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు గత ఏడాది SEPలో అడిగింది. ఈ విషయంలో అబద్ధాలాడిన చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. CBN నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కుర్చీ కోసం ఆరాటమా?’ అని Xలో ప్రశ్నించారు.

News February 16, 2025

వచ్చేవారం నుంచి జాగ్రత్త.. 38°Cకు ఉష్ణోగ్రతలు!

image

AP: రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందని Andhra Pradesh Weatherman తెలిపారు. మంగళవారం(18th feb) నుంచి గుంటూరు-విజయవాడ, అనకాపల్లి-విజయనగరం, కర్నూలు-కడప బెల్ట్‌లో ఉష్ణోగ్రతలు 38°C వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు, చలి.. మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ప్రజలు తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.