India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం) TOLETకు ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ Xలో పోస్ట్ చేసింది. ‘అమెరికా(మనమడి దగ్గరికి)కు వెళ్లిపోయిన తాత, లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్లొచ్చిన చెల్లి, ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో జైలుకు వెళ్లనున్న అన్న’ అని పేర్కొంది. TOLETతో పాటు ఫర్ సేల్ ఆప్షన్ కూడా ఉందని క్యాప్షన్ ఇచ్చింది.
అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. FY 2024లో అమెరికా పౌరసత్వం పొందిన వివిధ దేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. US Citizenship and Immigration Services లెక్కల ప్రకారం గత ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1% వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికో 13.1% వాటాతో జాబితాలో ముందుంది.
జమిలి బిల్లుపై అధ్యయనం చేసేందుకు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన <<14936882>>జేపీసీలో<<>> మొత్తం 39 మందికి చోటు దక్కింది. ఇందులో 16 మంది బీజేపీ, ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలున్నారు. ఎస్పీ, టీఎంసీ, డీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు. టీడీపీ, జనసేన, వైసీపీ, శివసేన, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేఎస్పీ(ఆర్వీ), శివసేన(యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, ఆప్, బీజేడీ, సీపీఐ(ఎం) తరఫున ఒక్కో సభ్యుడికి అవకాశం దక్కింది.
స్టాక్ మార్కెట్లకు ఈ వారం ఓ పీడకలే అని చెప్పాలి. బెంచ్ మార్క్ సూచీలు రెడ్ తప్ప గ్రీన్లో ముగిసిన రోజంటూ లేకుండాపోయింది. Sensex 4 వేల పాయింట్లు, Nifty 1,200 పాయింట్లు నష్టపోయాయి. సూచీల్లో 5% మేర తరుగుదల కనిపించింది. Over Valuation భయాలు, Fed కఠిన నిర్ణయాల సూచనలు, క్రిస్మస్ సెలవులతో FIIల డిజిన్వెస్ట్మెంట్ (ఈ రోజు -3597 Cr), వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి.
జమిలి ఎన్నికలపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ ఛైర్మన్గా నియమితులయ్యారు. తొలుత 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేయగా, తాజాగా సభ్యుల సంఖ్యను 39కి పెంచారు. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులకు కమిటీలో చోటు దక్కింది. అంతకుముందు ఉదయం జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని రాజ్యసభ తీర్మానించిన విషయం తెలిసిందే.
‘పుష్ప 2’ మూవీ ఓటీటీ రిలీజ్పై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తెలిపింది. మూవీ విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుందని పేర్కొంది. అప్పటివరకు బిగ్ స్క్రీన్లోనే ఈ మూవీని ఎంజాయ్ చేయాలని కోరింది. దీని ప్రకారం జనవరి చివరి లేదా FEB మొదటి వారంలో OTTలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ JAN 9న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మందిర్-మసీదు <<14933080>>వివాదాలకు<<>> ఇక తెరదించాలని RSS చీఫ్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై SP చీఫ్ అఖిలేశ్ స్పందించారు. UPలోని సంభల్లో మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన అనంతరం భాగవత్ స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పెట్టిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవచ్చని, BJP ఆ పని చేయాలన్నారు.
TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ FIR <<14930659>>ఆధారంగా<<>> ECIR నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, BLN రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ FIRలో ఉన్న అంశాలనే ఈడీ ECIRలో ప్రస్తావించింది. రూ.55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేయనుంది.
టెక్సాస్లోని లూయిస్విల్లేకు చెందిన మార్గరెట్ హాకిన్స్ బోమెర్ 16 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు శిశువుకు వెన్నెముక సమస్యను వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసేందుకు తల్లి గర్భంలోంచి 20 నిమిషాల పాటు బయటకు తీసి వెన్నెముకపై ఉన్న కణితిని ఆపరేషన్ చేసి తొలగించారు. తర్వాత శిశువును తిరిగి గర్భసంచిలో ఉంచారు. వారాలు నిండిన తర్వాత మరోసారి ఆపరేషన్ చేసి చిన్నారి లిన్లీ హోప్కు రెండో జన్మనిచ్చారు.
ఇండియా సాధించిన అతిపెద్ద విజయాలను పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా Xలో రాసుకొచ్చారు. అందులో చంద్రయాన్-3ని మన దేశం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. దీని తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, G20 నాయకత్వం, డిజిటల్ ఇండియా పెరగడం, 110 యునికార్న్లకు పైగా అభివృద్ధి, మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రపంచ కప్ విజయం, గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరగడం అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.