India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ ఆమెను కలవగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అదనపు కట్నం తేలేదనే కోపంతో అత్తమామలు తమ కోడలికి HIV ఇంజెక్షన్ ఇచ్చారు. ఉత్తరాఖండ్కు చెందిన అభిషేక్తో UPకి చెందిన ఓ యువతికి గతేడాది పెళ్లైంది. అప్పట్లో రూ.15 లక్షల కట్నం ఇచ్చారు. ఇటీవల స్కార్పియో కారు కొనడానికి రూ.25 లక్షలు తేవాలని భర్త, అతని తల్లిదండ్రులు వేధించారు. ఆమె ఒప్పుకోకపోవడంతో HIV సోకిన సిరంజితో ఇంజెక్ట్ చేశారు. ఆస్పత్రికి వెళ్లగా విషయం తెలిసింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు.

IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోంగ్రౌండ్ విశాఖపట్నంలో రెండు మ్యాచులు ఆడనుందని సమాచారం. DC తన మిగతా మ్యాచులను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో 3 మ్యాచులు ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ సెంటర్ కింద పంజాబ్ ఈ స్టేడియాన్ని ఎంచుకుంది. వచ్చే నెల 22 నుంచి IPL ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ RCB vs KKR మధ్య ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం ఆన్లైన్, పార్సిల్లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్ను నాశనం చేసి డీహైడ్రేటింగ్కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లో ఫుడ్ తినడం బెటర్.

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్కు ఘజన్ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.