India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘RRR: Behind & Beyond’ ఈరోజు థియేటర్లలో రిలీజైంది. దీనిని రూపొందించేందుకు ఎంతో కష్టపడినట్లు RRR టీమ్ ట్వీట్ చేసింది. ‘RRR మూవీ డాక్యుమెంటరీని రూపొందించడానికి 3 సంవత్సరాల ఫుటేజీని, దాదాపు 20TB డేటాను ట్రిమ్ చేసి, ఎడిట్ చేసేందుకు ఏడాది సమయం పట్టింది. ఇందులో ఎన్నో క్లిప్స్ని చూడొచ్చు. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది.
TG: ఈ కార్ రేసింగ్తో ప్రభుత్వానికి భారీ లాభం వస్తే స్పాన్సర్ ఎందుకు వెనక్కి వెళ్లారని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ‘ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. గవర్నర్ అనుమతి తీసుకున్నాం. అగ్రిమెంట్ లేకుండానే 2 విడతల్లో OCT 3, 11 తేదీల్లో డబ్బు పంపారు. రేసులో ఆర్బిట్రేషన్ను FPO వెనక్కి తీసుకుంది’ అని ఏజీ తెలిపారు.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ కింద తక్కువ ప్రీమియంలకే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. రూ.299తో పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం ఏర్పడినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 18-65 ఏళ్ల లోపు వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఆత్మహత్య, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ మరణాలకు ఈ ఇన్సూరెన్స్ లభించదు. వివరాలకు <
ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ ఎయిర్పోర్ట్ను చైనా నిర్మిస్తోంది. ఈశాన్య తీరంలో 20 చ.కి.మీ విస్తీర్ణంలో డాలియన్ జిన్ఝౌ బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరిట కృత్రిమ దీవి నిర్మాణం ప్రారంభించింది. 9 లక్షల చదరపు మీటర్ల పాసెంజర్ టెర్మినల్స్ దీనిలో ఉంటాయని CNN తెలిపింది. ఏటా 5,40,000 విమానాలు, 8 కోట్లమంది ప్రయాణికుల రద్దీ సామర్థ్యం ఈ ఎయిర్పోర్టుకు ఉంటుందని పేర్కొంది. 2035కల్లా ఇది పూర్తవుతుందని సమాచారం.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. వీక్ సెంటిమెంట్, రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమవ్వడం, విదేశీ ఇన్వెస్టర్ల ఔట్ఫ్లోతో బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద, నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, ఆటో, పీఎస్యూ బ్యాంకు, మెటల్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చించాలన్న KTR డిమాండ్పై CM రేవంత్ స్పందించారు. ‘ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేం ప్రమాణ స్వీకారం చేసినప్పుడే FEO కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. KTRతో చీకటి ఒప్పందం ఉందని మాకు చెప్పారు. మేము కూడా సహకరించాలని కోరారు. అప్పుడే మాకు ఈ స్కామ్ గురించి తెలిసింది. ఇది మొత్తం రూ.600 కోట్ల స్కామ్ అయ్యేది. ప్రభుత్వం మారడంతో రూ.55 కోట్లతో ఆగిపోయింది’ అని చెప్పారు.
మాజీ క్రికెటర్లకు BCCI అందిస్తున్న పెన్షన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాంబ్లీకి ₹30K/M వస్తుండగా అశ్విన్కు ₹60K/M అందుతాయి. ఇద్దరూ టీమ్ఇండియాకే ఆడినా కేటగిరీ వేరవ్వడమే ఇందుకు కారణం. కాంబ్లీ 17 టెస్టులే ఆడటంతో BCCI అతడిని ఫస్ట్క్లాస్ విభాగంలో చేర్చింది. 106 టెస్టులాడిన యాష్ టెస్టు విభాగంలో ఉన్నారు. అందుకే రెట్టింపు పెన్షన్ అందుకుంటారు. BCCI 2022లో రివైజ్ చేయకుంటే ఇందులో సగమే వచ్చేది.
పెరూలోని అమెజాన్ అడవిలో సైంటిస్టులు కొత్తగా 27 రకాల జీవజాతుల్ని గుర్తించారు. 2022లో ఈ అడవుల్లో వారు చేసిన పరిశోధనల ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. గుర్తించిన వాటిలో చిట్టెలుకలు, ఉడతలు, చేపలు, ఉభయచర జీవులు, సీతాకోకచిలుకల జాతులు ఉన్నాయన్నారు. మరో 48 జాతుల్ని కూడా గుర్తించినా వాటిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. గిరిజనులు నివసించే ఆల్టో మాయో ప్రాంతంలో ఇవన్నీ కనిపించినట్లు వివరించారు.
TG: ధరణి పోర్టల్తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గాదె శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారమంతా నాశనం అవుతుంది. ఇక్కడి సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే ఎంతో మంది నిపుణులు, మేధావులు, రైతునేతలతో చర్చించి ధరణిని రద్దు చేశాం’ అని సీఎం వెల్లడించారు.
జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 12న ఈ పదవితోపాటు ట్రెజరర్ను బీసీసీఐ నియమించనుంది. ఈ పదవి కోసం దేవజిత్ సైకియా, అనిల్ పటేల్, రోహన్ జైట్లీతోపాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అస్సాంకు చెందిన సైకియా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది.
Sorry, no posts matched your criteria.