India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో <<15413969>>వివాదాస్పద వ్యాఖ్యలతో<<>> కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన తరఫున వాదించేది మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కొడుకు అభినవ్ చంద్రచూడ్. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అభినవ్ ముంబైలోనే లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM చదివారు.

‘లవ్జిహాద్’ పై మహారాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంజయ్వర్మ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలు, పలు రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలను విశ్లేషించి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనుంది. త్వరలోనే ప్రభుత్వం ‘లవ్జిహాద్’ను నివారించేందుకు చట్టం తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.

TG: MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల కోసం LIG, MIG, HIG ఇళ్లు కట్టాలని చెప్పారు.

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్ను అరెస్ట్ చేశారు.

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్కు భారీ షాక్ తగిలింది. డోపింగ్లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.

కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20K మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో UNICEF, NGOలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్కు 17 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సినిమా తీయబోతున్నారనే ప్రచారాన్ని బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ ఖండించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త స్టోరీతో త్వరలోనే సినిమా చేస్తానని తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇందులో కథ చెప్పే విధానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.