news

News February 13, 2025

దుబాయ్‌లో భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్ల సందడి

image

ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా భారత్, పాక్ దిగ్గజ క్రికెటర్లు కప్‌తో దుబాయ్‌లో సందడి చేశారు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యువరాజ్, ఇంజమామ్, ఆఫ్రీదితో కలిసి దిగిన ఫొటోను నవజోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. లెజెండ్స్ ఈజ్ బ్యాక్ అని, బెస్ట్ ప్లేయర్స్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి CT హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మ్యాచ్ 23న దుబాయ్‌లో జరగనుంది.

News February 13, 2025

LoC వద్ద రెచ్చిపోయిన పాక్.. తిప్పికొట్టిన భారత్!

image

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు తెగబడగా భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల LoC వద్ద ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

News February 13, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ సేల్స్

image

ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. HYDలో సేల్ 50% తగ్గిందని వ్యాపారులు తెలిపారు. TGలో వైరస్ వ్యాప్తి లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం వల్ల జనం భయందోళన చెందుతున్నారని అంటున్నారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.

News February 13, 2025

బంగారం ధరలు.. తగ్గేదేలే

image

బంగారం ధర మరోసారి రూ.87వేల మార్క్ దాటింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.87వేల దిగువకు వచ్చింది. ఇవాళ మళ్లీ రూ.380 పెరగడంతో రూ.87,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 పెరగడంతో రూ.79,800గా నమోదైంది. అటు కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.

News February 13, 2025

ఎల్లుండి సెలవా?

image

TG: ఈనెల 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆరోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇక సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ CM రేవంత్‌ను మంత్రి సీతక్క, గిరిజన నాయకులు నిన్న కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సెలవుపై CM ఏం నిర్ణయం తీసుకుంటారో.

News February 13, 2025

మిగిలిన వారికి త్వరలో రైతు భరోసా: తుమ్మల

image

TG: జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.

News February 13, 2025

‘అమ్మా.. నాన్నా.. క్షమించండి’

image

రెండు రోజుల కింద విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని 12వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని గోరఖ్‌పూర్‌ హాస్టల్‌లో ఉంటున్న 18 ఏళ్ల అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, పాపా నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు కానీ మీ ఆశలను నెరవేర్చలేపోయాను’ అని ఆమె అందులో రాసింది.

News February 13, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్ అందుకేనా?

image

AP: వల్లభనేని వంశీని HYDలో <<15446091>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం TDP ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

News February 13, 2025

వంశీని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు: YCP

image

AP: గన్నవరం మాజీ MLA, YCP నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ మండిపడింది. అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, గన్నవరం TDP ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని ట్వీట్ చేసింది. కానీ, వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

News February 13, 2025

రోహిత్ అరుదైన రికార్డు

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. అత్యధికంగా 4 సార్లు వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచారు. WI, శ్రీలంక, NZ, ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించారు. తర్వాతి స్థానాల్లో మూడేసి క్లీన్ స్వీప్‌లతో కోహ్లీ, ధోనీ ఉన్నారు. గత 14 ఏళ్లలోనూ అత్యధిక క్లీన్ స్వీప్‌లు సాధించిన జట్టుగా భారత్(12) నిలిచింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్‌లతో రెండో స్థానంలో ఉంది.