India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
Febలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. 38 మందితో కూడిన అభ్యర్థుల నాలుగో జాబితాను ఆదివారం ప్రకటించింది. ఈ సారి కూడా న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, కాల్కాజీ నుంచి సీఎం ఆతిశీ పోటీ చేయనున్నారు. మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 20 మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించింది. పలువురికి స్థానచలనం కల్పించింది. కేజ్రీవాల్పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ పోటీ చేయనున్నారు.
మహిళల అండర్-19 ఆసియా కప్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 67 పరుగులే చేసింది. భారత బౌలర్ సోనమ్ యాదవ్ 4 వికెట్లు తీశారు. ఛేదనలో భారత్ 73 బంతులుండగానే జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ కమలిని 29 బంతుల్లో 44* పరుగులు చేశారు.
‘నాకు హిందీ తెలియదు కాబట్టి కొత్త నేర చట్టాలను పాత పేర్లతోనే పిలుస్తాను’.. ఇది మద్రాస్ HC జడ్జి జస్టిస్ ఆనంద్ గతంలో చేసిన వ్యాఖ్య. దేశ పౌరులందరికీ వర్తించే చట్టాలకు కేంద్రం హిందీ పేర్లు పెడుతుండడం చర్చకు దారితీస్తోంది. IPC, CrPC చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహితగా మార్చింది. తాజాగా The Aircraft Act-1934ను భారతీయ వాయుయాన్ విధేయక్గా మార్చడం వివాదమైంది.
తమిళ నటుడు అజిత్ తన తాజా సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ షూటింగ్ను ముగించారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ సెట్లో అజిత్ ఫొటోను షేర్ చేయగా ఆ లుక్ వైరల్ అవుతోంది. ఎప్పుడూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో కనిపించే అజిత్, ఆ ఫొటోలో క్లీన్ షేవ్తో పాటు ఒళ్లు తగ్గి యువకుడిలా కనిపించడం విశేషం. ఆయన ఒకప్పటి అజిత్లా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ బిగ్ బాస్-8 ఫినాలే నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులదే బాధ్యత అన్నారు. గత సీజన్లో విన్నర్ పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై BRS తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పులు చేసి వదిలేస్తే, తమ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని, రేపు అసెంబ్లీలో అన్ని బయటపెడుతామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.54 వేల కోట్లు అప్పులు చేసిందని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని సీఎం చెప్పారన్నారు.
AP: ప్రజలకు మంచి చేసే వ్యక్తులను, చెడు చేసే వ్యక్తులను గుర్తుంచుకోవాలని CM చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంలో CM మాట్లాడారు. ‘2019-24 మధ్య రాష్ట్రాన్ని YCP నిర్వీర్యం చేసింది. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసింది. ప్రజల నెత్తిన చెయ్యి పెట్టి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ ఐదేళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదు. కానీ ప్రజలను హ్యాపీగా ఉంచడమే మా ధ్యేయం’ అని ఆయన పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. జూబ్లీహిల్స్లోని చిరు నివాసానికి బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరును కలిశారు. తాజా పరిణామాలపై ఆయనతో బన్నీ చర్చించినట్లు తెలుస్తోంది. కాగా నిన్న పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను పరామర్శించిన విషయం తెలిసిందే.
టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ(11)రికార్డును ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో కపిల్ దేవ్ (23) ఉన్నారు. వీరి తర్వాత జవగళ్ శ్రీనాథ్ (10) కొనసాగుతున్నారు.
AP: సినిమాలు చూసి యువత చెడుదారి పడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. సినిమాల్లోని మంచిని వదిలేసి, చెడునే ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత సమాజంలో డ్రగ్స్, గంజాయి, స్మగ్లింగ్ చేసేవారినే హీరోలుగా చూస్తున్నారు. కానీ ఇలాంటి సంస్కృతి పోవాలి. ఆడబిడ్డలను రక్షించేవారినే హీరోలుగా చూడాలి. మగపిల్లలను సరిగ్గా పెంచితే ఈ సమస్యలన్నీ ఉండవు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.