India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మహబూబాబాద్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు ఓ మహిళ తన పాపతోపాటు వచ్చారు. ఆమెకు సంబంధించిన వారు కూడా ఎవరూ లేరు. దీంతో ఆమె పరీక్ష రాసేవరకూ ఆ పాపను పోలీసులే ఎత్తుకుని ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసినవారు పోలీసులు మానవత్వం చాటుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో బిగ్బాస్ సీజన్-8 <<14884788>>విజేత<<>> ఎవరో తేలిపోనుంది. గ్రాండ్ ఫినాలేకు అన్నపూర్ణ స్టూడియోలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి విన్నర్ ప్రైజ్మనీ ఉండనుంది. ఈ సీజన్ విజేతకు రూ.55లక్షలు అందజేయనున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే మారుతీ డిజైర్ కారును కూడా బహుమతిగా ఇస్తారు.
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోమారు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. ఖవాజా, మెక్స్వీనీ, స్మిత్, మార్ష్, హెడ్ వికెట్లను బుమ్రా దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లందరూ తేలిపోయిన చోట బుమ్రా ఒక్కరే వికెట్లతో చెలరేగడం గమనార్హం. 87 ఓవర్ మార్కు దాటే సరికి ఆస్ట్రేలియా స్కోరు 327/6గా ఉంది.
దేశాభివృద్ధి విషయంలో నెహ్రూ మోడల్ విఫలమైందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ‘నెహ్రూ అభివృద్ధి మోడల్ నుంచి నెహ్రూ విదేశాంగ విధానం పుట్టుకొచ్చింది. దాన్ని ఇప్పుడిప్పుడే సంస్కరిస్తున్నాం. రష్యా, చైనా సైతం అప్పటి తమ భావజాలాల్ని నేడు వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం నేటికీ కొన్ని వర్గాలు వాటిని కొనసాగిస్తున్నాయి. 2014 తర్వాతి నుంచి అన్నీ సరిచేస్తున్నాం’ అని వివరించారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు. చిరు ఫ్యామిలీతో కలిసి ఆయన లంచ్ చేస్తారని తెలుస్తోంది. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ అరవింద్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో తరఫున ఉచిత అత్యవసర వైద్య సేవల కేంద్రం ప్రారంభించినట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలిపారు. ‘జాలి, దయలోనే నిజమైన సనాతన ధర్మం ఉంటుందని మా తాత ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలే స్ఫూర్తిగా ఉచితంగా అత్యవసర వైద్య సేవల్ని రామమందిరం వద్ద అందిస్తున్నాం. ఇప్పటికే శ్రీశైలం, తిరుమల, కేదార్నాథ్, బద్రీనాథ్ వద్ద ఇవి ఉన్నాయి. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేశారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లేదని సమాచారం. లోక్సభ బిజినెస్ ఖాతాలో ఈ బిల్లులు లేకపోవడం దీనిని బలపరుస్తోంది. కాగా రేపు లోక్సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం ప్రకటించింది. కానీ రివైజ్డ్ లోక్సభ బిజినెస్ ఖాతాలో ఈ బిల్లులు కనిపించలేదు.
TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు రాగా ప్రతి 500కు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు 30-35 ప్రశ్నలు అడిగి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5,00,000 ఇవ్వనుంది.
కొందరు రోజూ కూల్ డ్రింక్స్ తాగడాన్ని ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ అలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రింక్స్లో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్, ఇతర రసాయనాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. ఎముకల్లో డీకాల్సిఫికేషన్ పెరిగి బలహీనపడతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోయి క్రమంగా బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎనామిల్ నాశనమై దంతక్షయం ప్రమాదం పెరుగుతుంది.
నటి తాప్సీ పెళ్లి ఆమె బాయ్ఫ్రెండ్ మథియాస్తో ఈ ఏడాది మార్చి 23న ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అంతకు కొన్ని నెలల ముందుగానే తమ అధికారిక వివాహం పూర్తైనట్లు తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జనానికి ఈ విషయం తెలియదు. గత ఏడాది డిసెంబరులోనే మేం అధికారికంగా పెళ్లి చేసుకున్నాం. త్వరలోనే వివాహ వార్షికోత్సవం కూడా వస్తోంది. ఉదయ్పూర్లో వేడుక చేసుకున్నామంతే’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.