India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ- నమస్కారం, అరుణాచల్- జైహింద్, అసోం- నొమొస్కార్, బిహార్- ప్రణామ్, గుజరాత్- జై శ్రీకృష్ణ, హరియాణా- రామ్ రామ్, ఝార్ఖండ్ – జోహార్, కర్ణాటక- నమస్కార, కేరళ- నమస్కారం, MP- నమస్తే, MH- నమస్కార్, మణిపుర్ – కురుమ్జరి, మిజోరం – చిబాయ్, నాగాలాండ్ – కుక్నలిమ్, ఒడిశా- నమస్కార్, పంజాబ్ – సత్ శ్రీ అకల్, రాజస్థాన్ – రామ్ రామ్, TN – వనక్కం, యూపీ- రాధే రాధే, వెస్ట్ బెంగాల్ – నమొష్కార్.

యూకేలోకి చట్టవ్యతిరేకంగా ప్రవేశించి వివిధ పనులు చేస్తున్న 600మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. వీరంతా అక్రమంగా UKలో ప్రవేశించి రెస్టారెంట్లు, షాపింగ్మాల్స్, తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జులై నుంచి జనవరి వరకూ 4వేల మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

AP: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి చిన్న కుమారుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఎల్లుండి మాజీ సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాశ్ సోదరుడే పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీశ్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం సంతోషంగా ఉందని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు. ఆయన ఇలానే తన జోరు కొనసాగిస్తే భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ అని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో హిట్మ్యాన్ ఫామ్ అందుకున్నారని ప్రశంసించారు. ఆ మెగా టోర్నీలో రోహిత్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

AP: అన్నదాతల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. హార్టికల్చర్, ప్రకృతి సాగుకు మద్దతు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగస్వాములు కావాలని SLBC సమావేశంలో కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదని స్పష్టం చేశారు.

‘లైలా’ ఈవెంట్లో పృథ్వీ చేసిన <<15417744>>కామెంట్లపై<<>> నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే వారు ఆయా వేదికలపై పాలిటిక్స్ చేయకూడదని ట్వీట్ చేశారు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలని సూచించారు. నటించినవారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమన్నారు. ‘గెలిచిన వానికి ఓటమి తప్పదు. ఓడిన వానికి గెలుపు తప్పదు. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’ అని రాసుకొచ్చారు.

AP: కార్పొరేషన్లు, బోర్డుల ఛైర్మన్లకు జీతభత్యాలు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కేటగిరీ-A కింద ఛైర్మన్కు నెలకు మొత్తం రూ.2.77 లక్షలు ఇవ్వనుంది. ఇందులో జీతం రూ.1.25 లక్షలు, వాహన అలవెన్సు రూ.60వేలు, ఇంటి అద్దెకు రూ.40వేలు, పీఏల జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్కు రూ.52వేలు చెల్లించనుంది. కేటగిరీ-B కార్పొరేషన్ ఛైర్మన్కు మొత్తం రూ.1.93 లక్షలు ఇవ్వనుంది.

AP:విజయవాడ వెస్ట్ బైపాస్కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని CM చంద్రబాబును APCC చీఫ్ షర్మిల కోరారు. ‘కాజా టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు 47.8KM దూరం గల బైపాస్ పూర్తి కావొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ బైపాస్తో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గుతాయి. ప్రజలకు రంగా చేసిన సేవ అనిర్వచనీయం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రంగా పేరు పెట్టండి’ అని ఆమె లేఖ రాశారు.

టాలీవుడ్ స్టార్ కపుల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత వివాహం జరిగి నేటికి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తన సతీమణికి విషెస్ తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత’ అని పేర్కొంటూ ఇద్దరూ కలిసున్న ఫొటో షేర్ చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం 2005లో వీరి వివాహం జరగ్గా.. ఇది తెలిసి లక్షల మంది మహిళా అభిమానులకు హార్ట్ బ్రేక్ అయింది.

HYD మీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికిన <<15405584>>ఘటనలో <<>>ప్రధాన నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను పోలీసులు FIRలో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్లను నిందితులుగా పేర్కొన్నారు. గురుమూర్తిపై హత్య కేసులు, మిగతా ముగ్గురిపై BNS 85 సెక్షన్(గృహహింస) నమోదు చేశారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. అటు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.