news

News December 14, 2024

జమిలి ఎన్నికలు 2029లోనే: చంద్రబాబు

image

AP: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయని CM చంద్రబాబు అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు తమ పూర్తి మద్ధతు ఉంటుందని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం నడుస్తోంది. విజన్-2020లాగే విజన్-2047 కూడా సక్సెస్ అవుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం చేపడుతున్నాం. అవగాహన లేకే YCP జమిలి ఎన్నికలపై ఏది పడితే అది మాట్లాడుతోంది’ అని ఆయన మండిపడ్డారు.

News December 14, 2024

క్రికెట్‌కు ఇద్దరు పాక్ ఆటగాళ్ల వీడ్కోలు

image

క్రికెట్‌కు ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కాగా అమీర్ గతంలో ఓసారి రిటైర్మెంట్ పలికారు. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడేశారు.

News December 14, 2024

ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు

image

ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పెంచింది. నేటితో ముగుస్తున్న డెడ్‌లైన్‌ను 14 జూన్ 2025 వరకు పొడిగించింది. పౌరులు ప్రతి పదేళ్లకు తమ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేస్తుండాలి. ఏజ్, పర్సనల్, అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి. ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా మార్పులు చేసుకోవచ్చు.

News December 14, 2024

ఫుడ్ షేర్ చేసుకున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వర్షం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా డగౌట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఇద్దరూ లంచ్ బ్రేక్‌లో ఫుడ్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బాక్స్‌లోని ఫుడ్ తింటూ కనిపించారు. కాగా ఇవాళ మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడం అనుమానమే.

News December 14, 2024

మోదీ, CBN, జగన్ ముద్దాయిలు: షర్మిల

image

AP: విజన్-2047 పేరుతో చంద్రబాబు మరోసారి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. రాష్ట్రం దిశ మారాలంటే విజన్లు కాదని, విభజన హామీలు నెరవేరాలని మండిపడ్డారు. పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండి, వేలసంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి దక్కేదన్నారు. విభజన హామీలు బుట్టదాఖలు చేసినవారిలో మోదీ, CBN, జగన్ తొలి ముగ్గురు ముద్దాయిలని షర్మిల ధ్వజమెత్తారు.

News December 14, 2024

OpenAI విజిల్ బ్లోయర్ సుచిర్ సూసైడ్‌పై డౌట్లు పెంచిన మస్క్ ట్వీట్!

image

OpenAI మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ కాపీరైట్, ఫెయిర్ యూజ్‌ నిబంధనలు పాటించడం లేదని అతడు బ్లాగులో ఆరోపించడం గమనార్హం. OpenAIతో విభేదించి బయటకొచ్చిన ఎలాన్ మస్క్ సుచిర్ మృతిపై ‘Hmmm’ అంటూ చేసిన ట్వీట్ సందేహాలు రేకెత్తిస్తోంది. ఘటనా స్థలంలో అనుమానాస్పద కదలికలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

News December 14, 2024

రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు

image

TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. OMR పద్ధతిలో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 10-12.30, మధ్యాహ్నం 3- 5.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

News December 14, 2024

స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు

image

వరుసగా రెండోరోజూ ఢిల్లీలోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. RK పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు ఉదయం 6:09 గంటలకు మెయిల్ రావడంతో యాజమాన్యం వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిసింది. ఇప్పటి వరకు 40 స్కూళ్లకు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

News December 14, 2024

16న లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

image

దేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ కింద జమిలి ఎన్నికల బిల్లును తీసుకొస్తున్నారు. కాగా, 12న ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

News December 14, 2024

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత

image

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా గతంలో కూడా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చాలా సార్లు ఆస్పత్రిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 97 ఏళ్లు.