India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రిప్టోమార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. బిట్కాయిన్ $లక్ష మార్కుకు అటూఇటూ దోబూచులాడుతోంది. నిన్న $1,02,540 వద్ద గరిష్ఠాన్ని తాకిన BTC $99,311 వద్ద కనిష్ఠాన్ని చేరింది. చివరికి $1120 (RS 95K) నష్టంతో $100,004 వద్ద ముగిసింది. నేడు $700 (RS 59K) నష్టంతో $99,292 వద్ద ట్రేడవుతోంది. ఎథీరియం $11 పెరిగి $3892 వద్ద కొనసాగుతోంది. XRP, SOL, BNB, DOGE, ADA, TRON, AVAX, SHIB లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో 39 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. అలాగే, 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒకరోజులో ఇంతమందికి క్షమాభిక్ష ప్రకటించడం ఇది తొలిసారి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బైడెన్ పదవీకాలం జనవరి 20తో ముగియనుంది.
TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేయనుంది. అందరికీ ఒకేరకమైన యూనిఫాం చీరలను అందజేయనుంది. డిజైన్తో పాటు వీటిపై ఇందిరా మహిళా శక్తి పథకం లోగో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి నమూనాలను మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చీరలను ఫైనలైజ్ చేయనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ట్రంప్ ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కాగా, తనకు ట్రంప్ నుంచి ఆహ్వానం అందినా ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు జిన్పింగ్ సుముఖంగా లేరని ఆ దేశ మీడియా పేర్కొంది. అమెరికాకు చైనా అంబాసిడర్, అతని భార్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.
AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ను నేడు CM చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి CMతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిపి, దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది.
స్టాక్మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడొచ్చు. NOVలో రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గడం శుభసూచకం. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నాయి. నిన్న EU, US సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిక్కీ 400, గిఫ్ట్ నిఫ్టీ 94 పాయింట్ల మేర పతనమయ్యాయి. USD/INR మరింత బలహీనపడుతోంది. STOCKS TO WATCH: HAL, Ashok Leyland, GR Infra, Zomato, Yes Bank, CRISIL, Adani Green
AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ఇప్పటికే <<14851568>>ప్రకటించింది<<>>. అయితే అందులో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది MAR 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. క్యాలెండర్ ప్రకారం ఆరోజు రంజాన్ సెలవు ఉంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదేరోజు వస్తే మరుసటి రోజు APR 1కి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
TG: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కవులు, కళాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విగ్రహంలో తన తల్లి కనిపించిందని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. గత పాలనలో విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ గ్రామీణ మహిళ చేతులు ఖాళీగా ఉండవని కవి నందిని సిధారెడ్డి కొత్త విగ్రహ రూపాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వ రివార్డును తిరస్కరించినట్లు చెప్పారు.
H1B, L1 వీసాదారుల భాగస్వాములకు US గుడ్న్యూస్ చెప్పింది. వీరికి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు US డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు 180రోజులున్న కాలపరిమితి ఈ ప్రకటనతో 540రోజులకు పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 13నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే4, ఆ తర్వాత రెన్యూవల్కి అప్లై చేసుకున్న లేదా పెండింగ్లో ఉన్నవారికే ఇది వర్తిస్తుంది.
గుకేశ్ విజయం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అసమాన ప్రతిభ, కృషి, సంకల్పంతోనే విజయం సాధ్యమైందని గురువారం అభినందించారు. దీనిపై వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందించారు. ‘మీరు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు సర్’ అని రీట్వీట్ చేశారు. అటు, తమిళనాడుకు చెందిన గుకేశ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ఆ రాష్ట్ర CM స్టాలిన్, డిప్యూటీ CM ఉదయనిధి స్టాలిన్కు సైతం ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.