India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్(25) కెరీర్లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో 5 వికెట్లు తీశారు. అరుణాచల్ ప్రదేశ్పై జరిగిన ప్లేట్ మ్యాచ్లో గోవా తరఫున 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలిరోజే 84 పరుగులకు అరుణాచల్ ఆలౌట్ అయింది. దీనికి ముందు జరిగిన తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ అనధికారిక మ్యాచ్లో అర్జున్ 9 వికెట్లు తీయడం విశేషం.
ఫైబర్ యూజర్ల కోసం IFTV పేరిట BSNL 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు చూసే అవకాశం కల్పించింది. డేటా, బఫర్ సమస్యలు లేకుండా, క్వాలిటీతో వీటిని వీక్షించవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు BSNL లైవ్టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్లో తొలుత ఈ సేవలు ప్రారంభించగా, త్వరలో మిగతా రాష్ట్రాల్లో అమలు చేయనుంది.
నైపుణ్యలేమి, రెజ్యూమ్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఉద్యోగాలు పొందట్లేదు. ఈక్రమంలో గూగుల్ లేదా స్నేహితుడి రెజ్యూమ్ను కాపీ చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా అవగాహన ఉన్నదాని గురించి మాత్రమే రెజ్యూమ్లో పొందుపరచాలంటున్నారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామని వెనక్కి తగ్గకుండా అడిగిన ప్రశ్నలపై ప్రిపేర్ అవ్వాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా భయపడొద్దని సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. FIIలు వెళ్లిపోవడం, రూపాయి బలహీనత, ఇన్ఫ్లేషన్ పెరుగుదల ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటును పెంచాయి. సెన్సెక్స్ 77,690 (-984), నిఫ్టీ 23,559 (-324) వద్ద క్లోజయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.5లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. ఆటో, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. హీరోమోటో, హిందాల్కో, టాటా స్టీల్ టాప్లూజర్స్.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ షోలు చేస్తూ హీరో రానా బిజీగా గడుపుతున్నారు. తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో సరికొత్త ప్రోగ్రామ్తో ముందుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నటీనటులకు సంబంధించి మనకు తెలియని స్టోరీలను ఇందులో తెలియజేస్తారని రానా ట్వీట్ చేశారు. గతంలో ఆయన చేసిన ‘మెక్డోవెల్ నంబర్ 1 యారీ’ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్గా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జీటీ యాజమాన్యం ధ్రువీకరించింది. కాగా పార్థివ్ ప్రస్తుతం కామెంటేటర్, అనలిస్ట్గా సేవలందిస్తున్నారు. ఇకపై మైదానంలో దిగనున్నారు. కాగా పార్థివ్ భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 139 ఐపీఎల్ మ్యాచులు ఆడారు.
పాకిస్థాన్లో వరుసగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా టిక్టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు వాట్సాప్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె తన SM అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. గతనెల మరో టిక్టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్ఫ్రెండ్తో ఏకాంతంగా గడిపిన వీడియోలూ బయటికి రావడం కలకలం రేపింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్యకర్తలకు ఈ విషయం తెలియజేయాలని పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని జస్టిస్లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ నేతృత్వంలోని NCP గడియారం గుర్తును వాడకుండా ఆదేశించాలన్న పిటిషన్ను కోర్టు విచారించింది. NOV 20 మహారాష్ట్రలో పోలింగ్ డే.
స్త్రీ, భేడియా వంటి సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు అమర్ కౌశిక్ పరశురాముడి కథతో ‘మహావతార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నామని, 2026 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తెలిపింది. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి, పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం.
స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన స్విగ్గీని దాని పోటీ సంస్థ జొమాటో స్వాగతించింది. ‘యూ అండ్ ఐ.. ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా స్విగ్గీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశానికి కలిసి సేవ చేయడంలో ఇంతకంటే మంచి సంస్థను ఊహించలేం’ అని వ్యాఖ్యానించారు. కాగా GMP సూచించిన దానికంటే ఎంతో మెరుగ్గా స్విగ్గీ ఐపీఓ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.