India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదిక కానుంది. ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాజ్యాంగంపై ఇరు సభల్లో చర్చ జరగనుంది.
HYDలో నూతన సంవత్సర వేడుకలకు క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, 3 స్టార్ ఆపై హోటల్స్ నిర్వాహకులకు CP ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31/JAN 1న రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు అనుమతి తప్పనిసరని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రా.10గంటల వరకే DJ అనుమతిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తప్పనిసరి అన్నారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
TG: రైతుకు <<14858119>>బేడీలు వేసిన ఘటన<<>> వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. దీనికి సంగారెడ్డి జైలు సిబ్బంది తప్పిదమే కారణమని తేల్చారు. జైలు అధికారులు VKB పోలీసులకు బదులుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారని, హీర్యా నాయక్ లగచర్లలో అరెస్టయితే బాలానగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో ఉందని గుర్తించారు. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ను సస్పెండ్ చేశారు.
APలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 21 మందికి చోటు కల్పించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉండగా ఈ స్థానంలో కేజ్రీవాల్ పోటీ చేసే అవకాశముంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. క్యాబినెట్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నమని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఉందని, దీనిని వ్యతిరేకించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
TG: సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 31లోగా హాస్టళ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా టీషర్టుల డ్రామా ఆడి పారిపోయారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
TG: డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మల్లన్న కళ్యాణం, జాతరపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.46 కోట్లతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అటు త్వరలో CM రేవంత్ను కలిసి స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.