news

News November 12, 2024

VIRAL: ఏపుగా కాదు.. అడ్డంగా పెరుగుతాయ్!

image

పైనున్న చెట్టుకేంటి ఒకవైపే కొమ్మలున్నాయి అనుకుంటున్నారా? ఇలాంటివి న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి స్లోప్ పాయింట్ సమీపంలోని సౌత్ ఐలాండ్‌లో ఉంటాయి. దక్షిణ మహాసముద్రం నుంచి వచ్చే ఎడతెగని గాలుల వల్ల ఇలాంటి ఆకృతిలో చెట్లు పెరుగుతుంటాయి. ఈ గాలులు బలంగా, స్థిరంగా ఉండటంతో చెట్లు అడ్డంగా పెరిగినట్లు కనిపిస్తుంటుంది. కఠోరమైన పరిస్థితులనూ ప్రకృతి తనకు అనుకూలంగా మార్చుకుంటుందనడానికి ఇదొక ఉదాహరణ.

News November 12, 2024

EPF, EPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంచితే ఉద్యోగికి నష్టమా?

image

EPF బేసిక్ పే లిమిట్ రూ.15K నుంచి రూ.21Kకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ లిమిట్ దాటినవాళ్ల ఎంప్లాయీ (12%), ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (12%) EPFలోనే జమ అవుతున్నాయి. లిమిట్ లోపు ఉన్నవాళ్ల ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్‌లో 8.33% అంటే గరిష్ఠంగా రూ.1250 EPSకు వెళ్తుంది. లిమిట్ పెంచితే ఇది రూ.1749 వరకు పెరుగుతుంది. దీంతో EPF తగ్గి EPS కార్పస్ పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పింఛన్ లభిస్తుంది.

News November 12, 2024

ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దయ్యేది అక్రమంగా ఉంటున్న వారికే..

image

USలో ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దవుతుందనే వార్తలు భారతీయులను కలవరపెడుతున్నాయి. రూల్స్ ప్రకారం దంపతులకు గ్రీన్ కార్డు, H1B, స్టూడెంట్ వీసా లేకపోయినా అక్కడ పిల్లలు జన్మిస్తే ఆ శిశువుకు నేరుగా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. అనంతరం తల్లిదండ్రులకు కూడా సిటిజన్‌షిప్ లభిస్తుంది. ఈ నిబంధనను ట్రంప్ మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమంగా ఉంటున్న వారి గురించి మాత్రమే ట్రంప్ ప్రచారంలో ప్రస్తావించారు.

News November 12, 2024

లగచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఉద్యోగ సంఘాల జేఏసీ DGPకి ఫిర్యాదు చేసింది. అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGPకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

News November 12, 2024

ట్రంప్ రాకతో USలో వాటికి పెరిగిన డిమాండ్

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపుతో అగ్ర‌రాజ్యంలో అబార్ష‌న్ పిల్స్‌కి డిమాండ్ పెరిగింది. ట్రంప్ గెలిచిన 24 గంట‌ల్లోనే పిల్స్ కోసం 10K అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చిన‌ట్టు ఎయిడ్‌ యాక్సెస్ స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ తెలిపింది. ఇది రోజువారి డిమాండ్‌లో 17 రెట్లు అధిక‌మ‌ని పేర్కొంది. గ‌ర్భ‌విచ్ఛిత్తి హ‌క్కును నిషేధిస్తాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు అబార్ష‌న్ పిల్స్‌ కోసం తెగ ఆర్డర్ చేస్తున్నారు.

News November 12, 2024

మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్‌లో నిధులు

image

AP: సూపర్‌సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.

News November 12, 2024

All in Red: అన్ని రంగాలు న‌ష్టాల్లోనే

image

Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగ‌ళ‌వారం న‌ష్ట‌పోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services స‌హా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి. ఆగ‌స్టు 5వ తేదీన 23,900 ప‌రిధిలో Nifty స‌పోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వ‌డంతో త‌దుప‌రి ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

News November 12, 2024

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. <<14057734>>సింగిల్ బెంచ్ తీర్పును<<>> సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ వేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదంటూ అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేశారు.

News November 12, 2024

30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ.. తాజాగా అరెస్టు

image

త‌మిళ‌నాడులోని తెప్ప‌కులం PS ప‌రిధిలో 30 ఏళ్ల క్రితం ₹60 చోరీ చేసిన నిందితుడిని మ‌ధురై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పెండింగ్ కేసులు విచారిస్తుండగా ఈ కేసు వెలుగుచూసింది. పోలీసులు జ‌క్క‌తోప్పు ప్రాంతానికి వెళ్లి నిందితుడు పన్నీర్ సెల్వం కోసం విచారించారు. అతను శివ‌కాశిలో ఉంటున్నాడని తెలిసి అక్క‌డికి వెళ్లి అరెస్టు చేశారు. సగటు ద్రవ్యోల్బణం 6.5% వేసుకున్నా అప్పటి ₹60 విలువ 2024లో ₹396.86 అవుతుంది.

News November 12, 2024

కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా

image

విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.