India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ సర్వర్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ డౌన్ అయినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెసేజ్లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి వాట్సాప్లో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. మీ ఫోన్లలోనూ ఇలాగే సర్వర్ డౌన్ ఇష్యూ వచ్చిందా COMMENT చేయండి.
తేది: డిసెంబర్ 12, గురువారం
ద్వాదశి: రా.10.26 గంటలకు
అశ్వని: ఉ.9.52 గంటలకు
వర్జ్యం: 1) ఉ.7.39 గంటలకు
2) సా.6.39- 8.07గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10-10.54 గంటల వరకు
2) మ.2.37- 3.21గంటల వరకు
AP: అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడ లెనిన్ సెంటర్లోని కార్యాలయంలో డిసెంబర్ 12న లాటరీ తీయనున్నట్లు CRDA కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సూచించారు.
* APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఇసుక విషయంలో అధికారులదే బాధ్యత: పవన్ కళ్యాణ్
* ఇంటర్, SSC పరీక్షల షెడ్యూల్ విడుదల
* TG: మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్
* కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్
* సీపీ విచారణకు మంచు విష్ణు, మనోజ్ హాజరు
* ఈ నెల 24 వరకు విచారణకు హాజరవ్వకుండా మోహన్ బాబుకు ఊరట
* రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటిన ‘పుష్ప-2’
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనితో సహా 12 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను తాలిబన్ మీడియా రిలీజ్ చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను మార్చి 16వ తేదీ ఉదయం 9.30 నుంచి మ.12 వరకు నిర్వహించనుంది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను మార్చి 17వ తేదీన ఉదయం 9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ కోసం ఇక్కడ <
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.
తర్జనభర్జనల అనంతరం మహాయుతిలో CM అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చింది. అయితే మంత్రివర్గ విస్తరణలో పీఠముడి వీడడం లేదు. కీలక శాఖల కోసం మిత్రపక్షాలు పట్టుబడుతున్నాయి. మధ్యేమార్గంగా మీకది-మాకిది అన్నట్టుగా శాఖలు పంచుకోవాలని నిర్ణయించాయి. 42 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండడంతో మొత్తంగా BJPకి 21-22, శివసేనకి 12-13, NCPకి 7-8 దక్కవచ్చు. Dec 14న విస్తరణ ఉంటుందని సమాచారం.
కరోనా మహమ్మారి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో చూశాం. చైనాలోని ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీకైందన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన పలు వైరస్లు మిస్ కావడం కలకలం రేపుతోంది. హెండ్రా వైరస్, లిస్సా వైరస్, హంటా వైరస్ వంటివి వాటిలో ఉన్నాయని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.