news

News December 11, 2024

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

AP: పదో తరగతి పరీక్షల <>షెడ్యూల్‌ను <<>>మంత్రి లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకునేలా షెడ్యూల్ ఇచ్చామని, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

News December 11, 2024

రూల్స్ ప్రకారమే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు: కేంద్రం

image

IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్ల‌పై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ర‌ద్దు చేసే ఆలోచ‌న ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌద‌రీ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజ‌ర్ రూల్స్‌-2015 ప్ర‌కార‌మే Clerkage fee వ‌సూలు చేస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశార‌ని ప్ర‌శ్నిస్తే, ఆ వివ‌రాలు విడిగా త‌మ వ‌ద్ద లేవ‌ని బ‌దులిచ్చింది.

News December 11, 2024

మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్

image

TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.

News December 11, 2024

రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు మిస్సింగ్

image

AP: రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు లేవని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తం 5.4 కోట్ల మంది జనాభాకు 4.9 కోట్ల మంది వివరాలే ఉన్నాయని వెల్లడించింది. మిగతా వారి వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. గత సర్వేల్లో చేసిన వివరాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు.

News December 11, 2024

GOOD NEWS.. ప్రభుత్వం కొత్త పథకం

image

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురానుంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు, సామాజిక భద్రత లేవు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ-కామర్స్, సేవా రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఓ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 70 లక్షల మంది వర్కర్లు ఉన్నట్టు అంచనా.

News December 11, 2024

మొబిక్విక్ IPO: Fully Subscribed

image

డిజిట‌ల్ ఆర్థిక సేవ‌ల సంస్థ మొబిక్విక్ IPOకు Retail Investors నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. బుధ‌వారం ప్రారంభ‌మైన IPO మొద‌టి గంట‌లోనే పూర్తిగా స‌బ్‌‌స్ర్కైబ్ అవ్వ‌డం గ‌మ‌నార్హం. ₹265-279 Price Bandతో ఆఫ‌ర్ చేసిన 1.18 కోట్ల షేర్ల‌కు 2.17 కోట్ల బిడ్లు దాఖ‌ల‌య్యాయి. AI , సేవ‌ల విస్తృతికై ఈ Fintech సంస్థ ₹572 కోట్ల స‌మీక‌ర‌ణ‌కు ఐపీవోకు రాగా 7.6% అధికంగా సబ్‌స్ర్కిప్షన్ డిమాండ్ ఏర్ప‌డింది.

News December 11, 2024

అక్కడ అలా.. ఇక్కడ ఇలా!

image

ప్రయాణికులు లేకున్నా విద్యార్థి చదువు కోసం రైలును కొనసాగించిన ఘటన జపాన్‌లో జరిగింది. హక్కైడోలో క్యుషిరటాకి అనే రైల్వే స్టేషన్‌లో కనా హరాడా అనే విద్యార్థి మాత్రమే రోజూ ప్రయాణించేది. రైలు ఆపితే ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని డిగ్రీ పూర్తయ్యేవరకూ ట్రైన్ కొనసాగించారు. అదే మన దగ్గర వరంగల్ జిల్లా నెక్కొండలో ప్రయాణికులు లేకుంటే రైలు నిలుపరని, ప్రజలే చందాలు వేసుకుని రోజూ టికెట్స్ కొంటున్నారు.

News December 11, 2024

వైద్యులు, ఆర్మీ, టీచర్లపైనే ఎక్కువ నమ్మకం!

image

ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ప్రజలు వైద్యులపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నట్లు తేలింది. 2024లో IPSOS జరిపిన సర్వేలో ఇండియాలో 57శాతం మంది డాక్టర్ వృత్తిపై ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. దీంతోపాటు ఆర్మీ ఆఫీసర్లను 56%, టీచర్లను 56%, సైంటిస్టులను 54%, జడ్జిలను 52%, బ్యాంకర్స్‌ను 50%, పోలీసులను 47 శాతం మంది నమ్ముతున్నారు. కాగా, రాజకీయ నాయకులు అట్టడుగున ఉన్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

News December 11, 2024

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

News December 11, 2024

వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్

image

AP: వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్‌ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.