India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ రైస్ తినని వారికి ప్రత్యామ్నాయం చూసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సినిమా నుంచి మంచి నేర్చుకోవడం కంటే, చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గ్వాలియర్లోని(MP) కాజల్ టాకీస్లో ‘పుష్ప-2’ సినిమా చూసేందుకు వచ్చిన షబ్బీర్తో క్యాంటిన్ సిబ్బంది గొడవకు దిగారు. వాగ్వాదం పెరగడంతో సినిమాలో అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తూ ప్రత్యర్థుల చెవిని కొరికినట్లు.. షబ్బీర్ చెవిని ఒకరు కొరికేశాడు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బాక్సాఫీసుపై అల్లు అర్జున్ ‘పుష్ప-2’ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్రను లిఖించిందని పేర్కొంది. దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారని పేర్కొంది.
కన్నీళ్ల నుంచి విద్యుత్ తయారుచేసే యోచనలో సైంటిస్టులున్నట్లు తెలుస్తోంది. మానవ కన్నీళ్లలో నాక్రే అనే మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఉన్నట్లు వారు గుర్తించారు. ఇవి ఒత్తిడికి గురైనప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని పరిశోధనలో తేలినట్లు తెలుస్తోంది. ఇది కన్నీళ్ల నుంచి బయోఎలక్ట్రిక్ ఎనర్జీని ఉపయోగించడంపై ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో దీనిపై మరింత పరిశోధన చేసే అవకాశం ఉంది.
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్తో పాటు సెక్యూరిటీ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
AP: పదో తరగతి పరీక్షల <
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.
IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్లపై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌదరీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజర్ రూల్స్-2015 ప్రకారమే Clerkage fee వసూలు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశారని ప్రశ్నిస్తే, ఆ వివరాలు విడిగా తమ వద్ద లేవని బదులిచ్చింది.
TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.
AP: రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు లేవని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తం 5.4 కోట్ల మంది జనాభాకు 4.9 కోట్ల మంది వివరాలే ఉన్నాయని వెల్లడించింది. మిగతా వారి వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. గత సర్వేల్లో చేసిన వివరాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు.
Sorry, no posts matched your criteria.