India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కు అలవాటే’ అని విమర్శించారు.

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.

TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.

TG: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని CM రేవంత్ వెల్లడించారు. ‘క్యాబినెట్లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎన్నడూ ఉండవు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో అన్నారు.

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.

దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్వోసీ దాటి ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్పై దాడికి యత్నించడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు.

RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.

AP: విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వైజాగ్లోని రూ.44.74 కోట్ల విలువైన హయగ్రీవ ఆస్తులు అటాచ్ చేసింది. కాగా వృద్ధులు, అనాథలకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ భూములను ఆయన దుర్వినియోగం చేసినట్లు ఈడీ గతంలో తేల్చింది. ప్లాట్లుగా విభజించి వేర్వేరు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించినట్లు గుర్తించింది.

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.