India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ప్రపంచంలోనే జపాన్లో అత్యధికంగా విద్యావంతులు ఉన్నట్లు తాజాగా విడుదలైన ఓ నివేదికలో వెల్లడైంది. ఇండియా 53వ స్థానంలో ఉండగా చైనా 27, అమెరికా 22వ స్థానాల్లో ఉన్నాయి. విద్యావంతులు కలిగిన దేశాల జాబితా వరుసగా.. జపాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, జెర్మనీ, డెన్మార్క్, కెనడా, నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇటలీ, USA, స్పెయిన్, చైనా, రష్యా, UAE ఉన్నాయి.

నేడు బెంచ్మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.

తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

AP: అంబేడ్కర్ కోనసీమ(D) సఖినేటిపల్లి(మ) అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో అర్చకులు కళ్యాణం జరిపించనున్నారు. దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిరానున్నారు. ఆర్టీసీ దాదాపుగా 105 బస్సులు తిప్పుతుండగా, 1600 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT

ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.