India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ తదితరులు మోదీని కలిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వరకు 3 రోజులపాటు 40 నగరాల్లో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.
TG: రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీని కలిసిన నటుడు మంచు మనోజ్ తిరిగి జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. తాను ఎవరితో గొడవపెట్టుకోనని సీపీకి హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మీడియా సమావేశం వాయిదా వేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా ఫ్లాట్గా ముగిశాయి. సెంటిమెంట్ను బలపరిచే న్యూస్ లేకపోవడం, గత సెషన్లో అమెరికా సూచీలు Dow Jones, Nasdaq, S&P500 నష్టపోవడంతో దేశీయ సూచీలు స్తబ్దుగా కదిలాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద, Nifty 31 పాయింట్లు పెరిగి 24,641 వద్ద స్థిరపడ్డాయి. FMCG, IT, ఆటో రంగ షేర్లు రాణించాయి. Trent, Baja Finance, Britannia టాప్ గెయినర్స్గా నిలిచాయి.
సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 2035 కల్లా పూర్తి చేస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. 2040కల్లా భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపుతామన్నారు. ‘మన అంతరిక్ష కేంద్రాన్ని భారతీయ అంతరిక్ష స్టేషన్గా పిలుస్తాం. వచ్చే ఏడాది చివరినాటికి గగన్యాన్ ద్వారా వ్యోమగామిని రోదసిలోకి పంపిస్తాం. ఇక సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతున కూడా పరిశోధనలు చేస్తాం’ అని తెలిపారు.
సిరాజ్, హెడ్ మధ్య జరిగిన గొడవపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘సిక్స్ కొట్టించుకున్న ఫాస్ట్ బౌలర్ వికెట్ తీశాక సిరాజ్లా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అవతలి వాళ్లు ఒకటి అంటే మనం రెండు అనాలి. వెనక్కి తగ్గాల్సిన పనేలేదు. భారత కోచ్గా ఉన్నప్పుడూ ఆటగాళ్లకు అదే చెప్పాను. పరిస్థితిని మరింత దిగజారనివ్వని పరిపక్వత హెడ్, సిరాజ్కు ఉంది కాబట్టి సమస్య లేదు’ అని పేర్కొన్నారు.
‘పుష్ప-2’ సినిమాపై విక్టరీ వెంకటేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్ అద్భుతమైన ప్రదర్శన స్క్రీన్పై నుంచి నా దృష్టిని మరల్చనివ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది. రష్మిక నటన, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం. పుష్ప-2 సూపర్ సక్సెస్ అయినందున డైరెక్టర్ సుకుమార్కి, చిత్రయూనిట్కు అభినందనలు’ అని వెంకీ ట్వీట్ చేశారు.
TG: మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అటు ప్రతి రెండు గంటలకోసారి ఆయన ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
మెదడులో కణితి పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్గా వ్యవహరిస్తారు. ముందుగా గుర్తిస్తే దీని చికిత్స సాధ్యమే. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. తరచూ తలపోటు, ఫిట్స్, చూపు మందగించడం, వికారం, వాంతులు, శరీరంలో సమన్వయ లోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, తరచూ కోపం రావడం, తడబాటు, బలహీనత, వినికిడి మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.
TG: మంచు మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనను విచారణకు పిలుస్తూ రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ను విచారిస్తున్నారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
BGTలో మూడో మ్యాచ్ బ్రిస్బేన్లో జరగనుంది. చివరిగా ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పిచ్ వేగంగా ఉంటుందని దాని క్యూరేటర్ తాజాగా తెలిపారు. ‘ప్రత్యేకించి వేగవంతమైన పిచ్నేమీ మేం తయారుచేయలేదు. బౌన్స్ బాగుండేలా చూస్తున్నాం అంతే. సంప్రదాయంగా గబ్బా ఎప్పుడూ ఫాస్ట్ వికెట్టే’ అని వెల్లడించారు. గత మ్యాచ్లో ఆసీస్ గెలవడంతో BGTలో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.