India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాలో హిందువులు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 5 నుంచి అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించింది. 70మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడులపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్ను కలిసిన నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్పై 2024 బడ్జెట్లో కేంద్రం ప్రకటన చేసింది. అనంతరం ఈ వ్యాధితో నటి పూనమ్ పాండే మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించడం సంచలనమైంది. అయితే అదో స్టంట్గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహన కల్పించడానికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశామని <<14840427>>Yes Madam<<>> ప్రకటించింది. ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
సౌతాఫ్రికా టూర్లో ఉన్న పాకిస్థాన్ డర్బన్లో జరిగిన తొలి టీ20లో ఓడింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రిజ్వాన్ చివరి వరకు పోరాడినా(74 రన్స్) విజయం దక్కలేదు. దీంతో సౌతాఫ్రికా 11పరుగుల తేడాతో గెలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్ 40 బంతుల్లో 82 రన్స్ చేశారు. 48 రన్స్ చేయడంతో పాటు 4 వికెట్లు తీసిన జార్జ్ లిండేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.
చాలామంది ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా అన్నం తినకుండా ఉండలేరు. మూడు పూటలా అదే తింటారు. కానీ అన్నం ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ వచ్చే ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో జీర్ణ సమస్యలతోపాటు ఊబకాయం బారిన పడే ఛాన్స్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అన్నానికి బదులు ఒకపూట ఇతర ఆహార పదార్థాలు తినడం బెటర్.
TG: నేటి నుంచి జరగనున్న MLAల ఓరియంటేషన్ సెషన్ను BRS బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. ‘శాసనసభ ప్రారంభానికి ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మా పార్టీ MLAల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోలేదు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలికి నిరసనగా సెషన్ బహిష్కరిస్తున్నాం’ అని KTR పేర్కొన్నారు.
AP: రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే పాలసీ ముఖ్య ఉద్దేశమంది. ఎకో, క్రూయిజ్, బ్యాక్ వాటర్ టూరిజం, బీచ్ సర్క్యూట్లను ప్రోత్సహించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ రూపొందించినట్లు వివరించింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TG: హైదరాబాద్ జల్పల్లిలో మోహన్బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.