news

News February 6, 2025

Stock Markets: తప్పని నష్టాలు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్‌టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.

News February 6, 2025

బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

News February 6, 2025

కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News February 6, 2025

‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.

News February 6, 2025

SBI ఆదాయం ₹1.28L CR, లాభం ₹16K CR

image

డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన SBI నికర లాభం రూ.16,791 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,164 కోట్లతో పోలిస్తే ఇది 84% పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,18,193 కోట్ల నుంచి రూ.1,28,467 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్ల నుంచి రూ.1,17,427 కోట్లకు ఎగిసింది. గ్రాస్ NPA 2.42 నుంచి 2.07, నెట్ NPA 0.64 నుంచి 0.53 శాతానికి తగ్గాయి.

News February 6, 2025

పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

image

TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

News February 6, 2025

సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్‌ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్‌పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News February 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజిల్‌వుడ్ దూరమైనట్లు ICC ప్రకటించింది. మడమ గాయంతో కమిన్స్, తుంటి సమస్యతో హేజిల్ ఆడటం లేదని పేర్కొంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ వైదొలగగా, స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నలుగురు కీలక ప్లేయర్ల స్థానంలో మరో నలుగుర్ని AUS క్రికెట్ బోర్డు ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 19 నుంచి CT స్టార్ట్ కానుంది.

News February 6, 2025

ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కల్కి నిర్మాణ సంస్థ

image

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడి అరెస్టయ్యారని జరుగుతున్న ప్రచారంపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. నీలేశ్ చోప్రా అనే వ్యక్తి తమ ఆఫీసులో పనిచేయలేదని, ఏ విధంగానూ అతనితో సంస్థకు సంబంధాలు లేవని Xలో పేర్కొంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఏదైనా సమాచారాన్ని పబ్లిష్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించింది.

News February 6, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు: కేటీఆర్

image

TG: యూజీసీ నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో కలిశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని వెల్లడించారు. NSC క్లాజ్‌తో రిజర్వ్‌డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని KTR తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.