news

News February 6, 2025

నర్సు నిర్వాకం.. గాయానికి కుట్లకు బదులు పెవిక్విక్

image

మనకు ఏదైనా గాయమైతే వైద్యులు కుట్లు వేస్తారు. అయితే కర్ణాటక హవేరి(D)లోని అడూర్ PHCలో స్టాఫ్ నర్స్ జ్యోతి ఫెవిక్విక్‌తో చికిత్స చేసింది. ఏడేళ్ల బాలుడి చెంపకు గాయమవడంతో పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నర్సు గాయానికి కుట్లు వేస్తే మచ్చలు పడతాయని చెప్పి ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ వేసింది. పేరెంట్స్ అభ్యంతరం చెప్పినా వినలేదు. ఈ ఘటనపై వారు చేసిన ఫిర్యాదుతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు.

News February 6, 2025

బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు

image

బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్‌లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

News February 6, 2025

అజిత్ ‘పట్టుదల’ పబ్లిక్ టాక్

image

అజిత్, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ‘విదాముయార్చి’(పట్టుదల) మూవీ ప్రీమియర్ షోలు యూఎస్‌లో మొదలయ్యాయి. ఈ యాక్షన్ సినిమా ఫస్టాఫ్ స్లోగా మొదలైనా ట్విస్టులు, కమర్షియల్ ఎలిమెంట్లు బాగున్నాయని పలువురు పోస్టులు చేస్తున్నారు. అజిత్ నటన, అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. కొన్ని సీన్లలో దర్శకుడు కాస్త తడబడినట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News February 6, 2025

ఇవాళ జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News February 6, 2025

నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.

News February 6, 2025

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం.. ట్రంప్ సంతకం

image

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచీ స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే’ అని స్పష్టం చేశారు.

News February 6, 2025

INDvsENG: అత్యధిక విజయాలు మనవే

image

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు 107 వన్డేలు జరిగాయి. వీటిలో టీమ్ ఇండియా 58 మ్యాచులు, ఇంగ్లండ్ 44 మ్యాచుల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు టై అవ్వగా మరో 3 రద్దయ్యాయి. స్వదేశంలో 52 మ్యాచులు జరగగా భారత జట్టు 34 విజయాలు సాధించింది. ఇవాళ తొలి వన్డే జరిగే నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో తుది జట్టులోకి స్పిన్నర్ వరుణ్‌ను తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

News February 6, 2025

విదేశీ పోర్న్ సైట్లలో మస్తాన్ వీడియోలు.. రూ.లక్షల్లో సంపాదన

image

TG: అమ్మాయిలతో మస్తాన్ సాయి అభ్యంతరకర వీడియోల కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అతను వందలాది వీడియోలను విదేశీ పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసి రూ.లక్షలు ఆర్జించేవాడని వెల్లడైంది. పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించేవాడని లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న పోలీసులు డ్రగ్స్ టెస్టు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది.

News February 6, 2025

కొత్త అగాఖాన్ ఎవరంటే..

image

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కరీమ్ అల్-హుసేనీ (49వ అగాఖాన్) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం 50వ అగాఖాన్‌గా ఆయన తనయుడు రహీమ్(53 ఏళ్లు) అల్-హుసేనీ కొనసాగుతారని అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. అగాఖాన్‌ను మహ్మద్ ప్రవక్తకు ప్రత్యక్ష వారసుడిగా, ఇమామ్‌గా ఇస్మాయిలీ ముస్లింలు భావిస్తారు. 50 తరాలుగా ఆ కుటుంబం తరఫున అగాఖాన్ నియామక సంప్రదాయం కొనసాగుతోంది.

News February 6, 2025

ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచుకోవచ్చు: కమిషన్

image

TG: ప్రైవేటు స్కూళ్లు ఏడాదికోసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులివే: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయుల్లో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలుండాలి. ఇవి ఫీజుల్ని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు. ఫీజుల వివరాలను అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలి.