India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుష్ప మేనియా ఢిల్లీని ఊపేస్తోంది. Febలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు పుష్ప పోస్టర్లను వాడుకుంటున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్-4, తగ్గేదే లే అంటూ ఆప్ పోస్టర్ విడుదల చేసింది. దీనికి కౌంటర్గా ఆప్ అవినీతిని ఇక అంతం చేస్తామని, రప్పా రప్పా అంటూ పార్టీ స్టేట్ చీఫ్ వీరేంద్రతో కూడిన పోస్టర్ను BJP విడుదల చేసింది.
బంగ్లా తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్తో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బృందం సమావేశమైంది. సోమవారం ఇరుదేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం యూనస్ను కలిసింది. ఇరుదేశాల మధ్య అన్ని రంగాల్లో సహకారం కొనసాగింపు, సంయుక్త ప్రయోజనాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు భారత్ పేర్కొంది. అలాగే బంగ్లాలో మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు <<14834003>>హత్య బెదిరింపులు<<>> రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చిన నంబర్ నుంచే ఈ కాల్ వచ్చినట్లు హోంమంత్రి గుర్తించారు. దీంతో ఆగంతకుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె ఆదేశించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బందర్ రోడ్డు నుంచి మల్లిఖార్జున రావు అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
TG: పహాడీ షరీఫ్ పీఎస్కు వచ్చిన హీరో మంచు మనోజ్ నిన్న జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
TG: కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది. మొన్న ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమైపోయాయి. తెలంగాణ తల్లి అని చెప్పి సీఎం బిల్డప్ ఇస్తున్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ మాయమైంది. విగ్రహ రూపంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సివిల్స్-2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC రిలీజ్ చేసింది. ఇక్కడ <
TG: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.
TG: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు పార్టీలు పోరాటం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆలె నరేంద్ర, విజయశాంతి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి వారు తమ రాజకీయ పార్టీల ఆలోచన, విధివిధానాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని ముందుకు కొనసాగాయి. కానీ 2014లో జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని గత పాలకులు నిర్వహించలేదు’ అని సీఎం విమర్శించారు.
శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయంతో ఆ జట్టు WTC ఫైనల్కు మరింత చేరువైంది. ప్రస్తుతం SA పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్తో జరిగే రెండు టెస్టు మ్యాచుల సిరీస్ను 1-0తో నెగ్గినా సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుంది. మరోవైపు భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై 3-2/3-1 తేడాతో సిరీస్ గెలవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 2, భారత్ 3 స్థానాల్లో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.