India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.
‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.
‘కాంతార’ సినిమాతో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను రాసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రాల్లో ఒక దానికి కథను అందించారని, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపాయి. కాగా, సదరు నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభాస్తో మొత్తం మూడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.
INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యంపై చర్చ తీవ్రమవుతోంది. కూటమి నేతల మాటలూ, చేతలూ పరోక్షంగా ఇవే సంకేతాలను పంపిస్తున్నాయి. ‘వాళ్లకు చేతకాకుంటే నేనే నడిపిస్తా’ అని మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్ర Sr పొలిటీషియన్ శరద్ పవార్ సైతం ఆమె సమర్థురాలని చెప్పి RGకి పరోక్షంగా పంచ్ ఇచ్చారు. మహారాష్ట్రలో MVA నుంచి విడిపోయిన SP.. TMCతో కలిసి అదానీ అంశంపై పార్లమెంటులో INDIA MPల నిరసనలో పాల్గొనలేదు. COMMENT
హైతీ దేశంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మోనెల్ మికానో అనే గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతో ముఠా సభ్యులు మురికివాడపై దాడిచేశారు. రెండు రోజులు నరమేధం సృష్టించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులను కత్తులతో విచక్షణారహితంగా నరికేశారు. ఈ ఘటనలో 110 మంది మరణించినట్లు నేషనల్ హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్వర్క్ వెల్లడించింది.
AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్లో PDF అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపీ మూర్తికి 8వేలకు పైగా ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 15,490 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదుగురు అభ్యర్థులు గోపీమూర్తి, నారాయణరావు, దీపక్, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడ్డారు.
Sorry, no posts matched your criteria.