India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.
INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యంపై చర్చ తీవ్రమవుతోంది. కూటమి నేతల మాటలూ, చేతలూ పరోక్షంగా ఇవే సంకేతాలను పంపిస్తున్నాయి. ‘వాళ్లకు చేతకాకుంటే నేనే నడిపిస్తా’ అని మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్ర Sr పొలిటీషియన్ శరద్ పవార్ సైతం ఆమె సమర్థురాలని చెప్పి RGకి పరోక్షంగా పంచ్ ఇచ్చారు. మహారాష్ట్రలో MVA నుంచి విడిపోయిన SP.. TMCతో కలిసి అదానీ అంశంపై పార్లమెంటులో INDIA MPల నిరసనలో పాల్గొనలేదు. COMMENT
హైతీ దేశంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మోనెల్ మికానో అనే గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతో ముఠా సభ్యులు మురికివాడపై దాడిచేశారు. రెండు రోజులు నరమేధం సృష్టించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులను కత్తులతో విచక్షణారహితంగా నరికేశారు. ఈ ఘటనలో 110 మంది మరణించినట్లు నేషనల్ హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్వర్క్ వెల్లడించింది.
AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్లో PDF అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపీ మూర్తికి 8వేలకు పైగా ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 15,490 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదుగురు అభ్యర్థులు గోపీమూర్తి, నారాయణరావు, దీపక్, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడ్డారు.
రైల్వే ప్రయాణికులు IRCTCలో టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్విటర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలో దీనిపై IRCTC ప్రకటన విడుదల చేసింది. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఈ-టికెటింగ్ సేవలు గంట సేపటి వరకు అందుబాటులో ఉండవని, తర్వాత ప్రయత్నించాలని పేర్కొంది. ఏవైనా సమస్యలుంటే 14646, 0755-6610661 లేదా 0755-4090600కు కాల్ చేయాలని సూచించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘RRR’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో యాంగిల్ను చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దర్శకధీరుడు రాజమౌళిపై ‘RRR: Behind & Beyond’ పేరుతో డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే విడుదలవుతుందని తెలిపారు.
సీజన్ను బట్టి పక్షులు వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటాయి. దీనిపై వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసింది. చియులువాన్2 అనే మగ గద్ద మణిపుర్ నుంచి కెన్యా, టాంజానియా, మలావి, జాంబియా గుండా సోమాలియాకు చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించారు. 3వేల కిలోమీటర్లను 5 రోజుల 17 గంటల్లో చేరుకుంది. గ్వాంగ్రామ్ అనే ఆడ గద్ద కూడా నాన్స్టాప్గా ప్రయాణించగలదని పరిశోధనలో తేలింది.
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై అమితాబ్ స్పందించారు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువ చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
ట్రాఫిక్ రూల్స్లో ఎంతో ముఖ్యమైన సిగ్నల్ లైట్స్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది ఈరోజే. డిసెంబర్ 9, 1868న ప్రపంచంలో తొలిసారిగా లండన్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ గ్యాస్ ల్యాంప్స్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నెలరోజుల్లోనే పేలుడు సంభవించడంతో ఈ ప్రయోగానికి ముగింపు పలికారు.
AP: సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చని నటి తరఫు లాయర్లు వాదించగా కోర్టు తోసిపుచ్చింది.
Sorry, no posts matched your criteria.