news

News February 5, 2025

BREAKING: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

image

AP: విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410KMగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న AP రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు, విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్‌పాడ్ రూట్లను సికింద్రాబాద్‌కు మార్చింది. ఈ జోన్ పరిధిలోకి VSP, VJA, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి.

News February 5, 2025

ముంబైలో ‘లండన్ ఐ’ ఏర్పాటు చేస్తాం: BMC

image

లండన్‌లోని భారీ జెయింట్ వీల్ ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోనూ భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తాజాగా సమర్పించిన రూ.74వేల కోట్ల బడ్జెట్‌లో దాని గురించి ప్రస్తావించింది. ఇంకా స్థల సమీకరణ జరగని నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించలేదని వెల్లడించింది. ఏసీతో కూడిన క్యాప్సూల్‌లో ప్రయాణికులు ముంబై నగరాన్ని ఎత్తు నుంచి తిలకించవచ్చని పేర్కొంది.

News February 5, 2025

తీన్మార్ మల్లన్నపై వేటు?

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

News February 5, 2025

రొమ్ము క్యాన్సర్ కేసుల్లో హైదరాబాద్ టాప్

image

దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లో రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనట్లు NIMS విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (PBCR) నివేదిక (2014–2016) ప్రకారం HYDలో లక్ష మంది మహిళల్లో 48 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. తర్వాతి స్థానాల్లో చెన్నై(42.2), బెంగళూరు(40.5), ఢిల్లీ(38.6), ముంబై(34.4) ఉన్నాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అత్యధికంగా రొమ్ము క్యాన్సరే(35.5%) ఉంది.

News February 5, 2025

ట్రంప్ నిర్ణయాలు.. ఆ ఆలయాలకు పెరిగిన భక్తులు!

image

US వీసా నిబంధనల్ని ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తుండటంతో భారతవ్యాప్తంగా ఉన్న ‘వీసా’ దేవుళ్లకు భక్తుల తాకిడి పెరిగింది. ట్రంప్ వచ్చాక TGలోని చిలుకూరు బాలాజీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వీసా హనుమాన్, పంజాబ్‌లోని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, ఢిల్లీలోని శ్రీ సిద్ధిపీఠ్ చమత్కారీ హనుమాన్, చెన్నైలోని శ్రీలక్ష్మీ వీసా గణపతి ఆలయాలకు రద్దీ భారీగా పెరిగిందని ఆయా ఆలయాల అధికారులు చెబుతున్నారు.

News February 5, 2025

నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప-2 హవా

image

థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 సినిమా ఓటీటీలోనూ దుమారం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 4రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 7 దేశాల్లో వ్యూయర్‌షిప్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర కేటగిరీల్లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ రూ.1850 కోట్లపై చిలుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

News February 5, 2025

నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’

image

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్‌ వేసినట్లు పోస్టర్‌పై NTR అని ఉంచి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.

News February 5, 2025

రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి

image

AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

News February 5, 2025

రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!

image

TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

News February 5, 2025

విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

image

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.