India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీడీపీ ఆరోపించింది. ‘ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తానన్న YS జగన్ దాన్నీ సరిగ్గా చేయించలేదు. లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు దండుకున్నారు. అందుకే ఎల్జీ పాలిమర్స్ తర్వాత కూడా వరుసగా 15 ప్రమాదాలు జరిగాయి’ అని Xలో విమర్శించింది.
AP: వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో డ్యాంలు ఎండిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది. రిజర్వాయర్లలో 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వ ఉందని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నీటి వృథాను నివారించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో రోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.
హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కోల్కతా ఆర్జీ కర్ కాలేజీ వద్ద నిరసనకు దిగిన వైద్యులు విధులకు హాజరుకాకపోతే గైర్హాజరుగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ హాజరును నమోదు చేయాల్సిందిగా వారు అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించలేరని సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. వైద్యులు విధులకు హాజరైతే గైర్హాజరైన రోజుల విషయంలో సానుకూలంగా స్పందించేలా ఆదేశిస్తామని తెలిపింది.
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తరువాత CM మమతా బెనర్జీ తీరుపై ఆమె మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. RG కర్ మెడికల్ కాలేజీలో అక్రమాలపై మమత చర్యలు తీసుకోలేదని, ఘటన జరిగిన తరువాత ప్రిన్సిపల్ను వెంటనే మరో కాలేజీకి బదిలీ చేయడాన్ని అభిషేక్ తప్పుబట్టినట్టు తెలుస్తోంది. దీని వల్లే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.330 తగ్గి రూ.72,870కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.300 తగ్గి రూ.66,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000గా ఉంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక స్కోర్(72) చేసిన ఆటగాడిగా నిలిచారు. 1983లో భారత ప్లేయర్ బల్వీందర్ సంధు పాక్పై చేసిన 71 స్కోర్ రికార్డును 41 ఏళ్ల తర్వాత మిలన్ బ్రేక్ చేశారు. డెబ్యూ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గానూ చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకున్నారు.
*షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.
*రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు తొలగిపోయి పొడిగా అవుతాయి.
*సల్పేట్ లేని షాంపూలు జుట్టుకు హాని కలిగించవు.
*షాంపూతో తలస్నానం చేసిన వెంటనే జుట్టును ఆరబెట్టేందుకు డ్రైయర్ వాడితే వెంట్రుకలు బలహీనపడతాయి.
*రాత్రి పడుకునే ముందు తలకు నూనె రాసి ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
AP: పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా మార్చేలా సంస్కరణలు తీసుకొస్తున్నట్లు Dy.CM పవన్ చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద రూ.40,579 కోట్ల పనులు జరిగాయి. కానీ దాని ఫలితాలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగా ఉన్నాయి. 2014-19 మధ్య గ్రామాల నుంచి పన్నుల రూపంలో రూ.240-270 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ YCP హయాంలో రూ.170 కోట్లే వచ్చింది. పన్నులు వసూలు చేయడం మానేశారో? ఏం చేశారో తెలియదు’ అని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు 300 కంపెనీల అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించింది. శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో ఈ కంపెనీల బలగాలు మోహరించాయి.
AP: పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగా దేశంలో ఎప్పుడూ లేని విధంగా రేపు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 87 రకాల పనుల కోసం ₹4,500 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ పనులకు సంబంధించి గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. 9 కోట్ల ఉపాధి దినాలతో 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.