news

News February 4, 2025

తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం: షర్మిల

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ AP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు తీయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

News February 4, 2025

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి?

image

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కోసం టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బ్యాకప్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో వరుణ్ కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనిపై త్వరలోనే BCCI నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లతో చెలరేగడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని డిమాండ్లు వచ్చాయి.

News February 4, 2025

జాక్వెస్ లాంటి ఆటగాడిని చూడలేదు: పాంటింగ్

image

సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్‌ కలీస్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఆడిన ఆటగాళ్లలో కలీస్ ఉత్తమ క్రికెటర్ అన్నారు. టెస్ట్‌ ఫార్మాట్లో 45కుపైగా సెంచరీలు 290కి పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడన్నారు. కలీస్ రికార్డులన్నీ చూస్తే ఆయన క్రికెట్ కోసమే పుట్టినట్టు అనిపిస్తుందని పాంటింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు

News February 4, 2025

హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?: MLA పాయల్ శంకర్

image

TG: బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు లేని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 4, 2025

అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం జరిగింది. పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ ఛైర్మన్‌గా కూన రవికుమార్‌లను నియమిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు.

News February 4, 2025

బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం: తలసాని

image

TG: కులగణన సర్వే ద్వారా BCలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో 30 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ‘ఈ సర్వే ప్రకారం BC, SC, ST జనాభా తగ్గినట్లు కనిపిస్తోంది. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు. ఇలాంటివాటికి చట్టబద్ధత కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News February 4, 2025

Stock Markets పరుగులు: ఇన్వెస్టర్లకు రూ.7లక్షల కోట్ల ప్రాఫిట్

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,739 (+378), సెన్సెక్స్ 78,538 (+1397) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు దుమ్మురేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌టీ, బీఈఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరోమోటో, నెస్లే ఇండియా టాప్ లూజర్స్. నేడు ఇన్వెస్టర్లు రూ.7లక్షల కోట్లు ఆర్జించారు.

News February 4, 2025

ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్

image

దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

News February 4, 2025

బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలాన్లు చూసి పోలీసులు షాక్

image

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే, అలా చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. KA 05 JX 1344 రిజిస్ట్రేషన్ నంబర్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా దానిపై 311 చలాన్లతో రూ.1.60లక్షల ఫైన్ గుర్తించారు. అతను హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లాంటివి పదేపదే చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

News February 4, 2025

సెహ్వాగ్, రిచర్డ్స్‌లాంటోడు అభిషేక్: హర్భజన్

image

టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, వీవీ రిచర్డ్స్ స్థానాలను టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన రెడ్ బాల్ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇస్తారని జోస్యం చెప్పారు. ‘అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గణాంకాలు బాగా లేకున్నా ఇంగ్లండ్‌పై బాదిన శతకంతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.