India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.

TG: బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగింది తప్ప స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ప్రతి పదేళ్లకు చేపడుతున్న జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల లెక్కలను మాత్రమే తీసుకుంటున్నారని, బలహీన వర్గాల (BC) సమాచారం ఉండట్లేదన్నారు. వారికి విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం ఇవ్వడానికే రాహుల్ గాంధీ సూచనలతో తాము తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం చెప్పారు.

క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా దానిని జయించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాధి విజేతలంటున్నారు. ‘క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం’ అని క్రికెటర్ యువరాజ్ చెప్పారు. ‘నాకు బాధితురాలిగా ఉండటం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటులేదు’ అని నటి హంసా నందిని అన్నారు. ‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను ఇస్తాడు’ అని నటుడు సంజయ్ దత్ చెప్పారు. భయాన్ని వీడి పోరాడి గెలవండి.

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.

ఎప్పుడు, ఎలా క్యాన్సర్ సోకుతుందో చెప్పలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు ఈ వ్యాధిని దరిచేరనివ్వవు. ఈక్రమంలో వైద్యులు పేర్కొన్న కొన్ని సలహాలు మీకోసం. ధూమపానం చేయొద్దు. హెల్తీ ఫుడ్ తినండి. హెపటైటిస్ బి& HPV నివారణకు టీకాలు వేసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మద్యం మానుకోండి. ప్రాసెస్డ్ మాంసం వద్దు. పండ్లు & కూరగాయలు తినండి, పుష్కలంగా నీరు తాగండి, గుడ్లు తినండి.

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రిమీలేయర్ ప్రతిపాదనను రేవంత్ తిరస్కరించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. మరోవైపు ఉపఎన్నికలు వస్తాయనే విపక్షాల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.

AP: రాష్ట్ర చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునః నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరు(D)లో 18 ఆలయాలకు రూ.38కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం సూచనతో రథ సప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. రాతి కట్టడాలకు గత ప్రభుత్వం రంగులు వేయడంతో పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులను తొలగిస్తామని తెలిపారు.

ఆడవారు అందంగా కనిపించేందుకు తమ జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రత్యేక అలంకరణలో కనిపించేందుకు ఇష్టపడుతారు. అయితే డిజిటల్ క్రియేటర్ నీహర్ సచ్దేవా గుండుతోనే పెళ్లి చేసుకున్నారు. చిన్నతనం నుంచే అలోపీసీయా వ్యాధితో బాధపడుతున్న ఆమె ఎలాంటి విగ్గులేకుండా పెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి కాస్త వైరల్ అవ్వడంతో బ్యూటీ అనేది ఎలా ఉన్నా ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,666 (+320), సెన్సెక్స్ 78,250 (+1110) వద్ద ట్రేడవుతున్నాయి. కొన్ని దేశాలపై టారిఫ్స్ను ట్రంప్ వాయిదా వేయడం, డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా స్టాక్స్ పుంజుకోవడం, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లలో ర్యాలీయే ఇందుకు కారణాలు. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6లక్షల కోట్ల సంపదను పోగేశారు. శ్రీరామ్ ఫైనాన్స్, LT, ADANI SEZ, BEL, TATAMO టాప్ గెయినర్స్.
Sorry, no posts matched your criteria.