India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ తమ సంతకాలతో కూడిన జెర్సీలను మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ మెడల్ సాధించినందుకు మనూకు కైఫ్ అభినందనలు తెలిపారు.
చాలామంది అమ్మాయిలు తాము వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇంట్లో వాళ్లు బాధపడతారనో తమ చదువు/ఉద్యోగం ఆగిపోతుందనే భయంతో బాధను మనసులోనే దాచుకుంటుంటారు. అందుకే ఆడపిల్ల ఉన్న ప్రతి పేరెంట్ కుమార్తె చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న చోట ఏవైనా ఇబ్బందులకు గురవుతున్నారా? అని పదేపదే అడుగుతూ ఉండండి. మీతో అలాంటి విషయాలు ఫ్రెండ్లీగా పంచుకోగలిగే వాతావరణం ఏర్పాటు చేయండి. > SHARE
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ తన పేరెంట్స్పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘బస్సు డ్రైవర్గా పని చేసే నా తండ్రి ‘నేను రోడ్డుపై బండి నడుపుతుంటే. నా కూతురు గాల్లో విమానంలో ప్రయాణించాలి’ అనడం నాకింకా గుర్తుంది. అదే నా జీవితాన్ని మార్చింది. కాలం కఠినమైంది. నాన్న మరణించిన కొన్నాళ్లకే అమ్మకు క్యాన్సర్ వచ్చింది. మనకు దక్కాల్సిన దాని కోసం ఎంతైనా పోరాడాలని అమ్మ నాకు నేర్పింది. అమ్మే నా ధైర్యం’ అని ట్వీట్ చేశారు.
ధూమపానం మానేసిన 20నిమిషాల తర్వాత హృదయ స్పందన రేటు తగ్గుతుంది. 12గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు మరింత ఆక్సిజన్ సరఫరా అవుతుంది. 1-2 రోజుల తర్వాత తల తిరగడం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ధూమపానం మానేసిన 4 సంవత్సరాల తర్వాత ధూమపానం అలవాటు లేని వ్యక్తిలా మీరు మారిపోతారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ విడుదలైంది. ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పున:ప్రారంభమైంది. పవన్ లేకుండా ఓ భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
అల్లోపతి ఔషధాలపై బాబా రామ్దేవ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ కంపెనీల విషపూరిత సింథటిక్ డ్రగ్స్ వల్ల ఏటా లక్షలాది భారతీయులు మరణిస్తున్నారని మండిపడ్డారు. ‘ఔషధ స్వాతంత్ర్యం కల ఇంకా నెరవేరలేదు. బ్రిటిష్ పాలనలో జరిగినట్టే అల్లోపతి మందులతో లక్షలమంది చనిపోతున్నారు. అందుకే మేం పతంజలి ద్వారా స్వదేశీ ఉద్యమం కొనసాగిస్తున్నాం. భారతీయ, సహజ వైద్య విధానాల వైపు ప్రజల్ని మళ్లిస్తున్నాం’ అని అన్నారు.
నెక్ట్స్ జనరేషన్ ఆర్టిలరీ గన్స్ సేకరణకు భారత సైన్యం రూ.7000 కోట్ల విలువైన టెండర్ జారీ చేసింది. వీటి డిజైన్, అభివృద్ధి, తయారీ స్వదేశంలోనే జరుగుతాయి. తొలి దశలో 400 గన్ సిస్టమ్స్ సేకరిస్తారు. L&T, భారత్ ఫోర్జ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి ప్రైవేటు రక్షణ రంగ కంపెనీలు టెండర్పై ఆసక్తితో ఉన్నాయి. భవిష్యత్తు దృష్ట్యా పాతవి వదిలించుకొని అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలను తీసుకోవాలని సైన్యం భావిస్తోంది.
MPకి చెందిన సురేశ్ మర్డర్ కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఫుట్పాత్పై పడుకోగా భిన్నంగా ఉన్న అతడి చెప్పులను చూసి కొందరు WB రేడియో క్లబ్కు సమాచారమిచ్చారు. మతిస్థిమితం లేక తప్పిపోయిన వారిని ఫ్యామిలీతో WBRC కలుపుతూ ఉంటుంది. ఆ చెప్పులు జైలులో ఇచ్చినవని గుర్తించి, ఫ్యామిలీ వివరాలు కనుక్కొని వారికి సమాచారం ఇచ్చింది. అలా ‘చెప్పుల’ వల్ల కుటుంబాన్ని కలిశాడతడు.
మహేశ్బాబు నటించిన ‘మురారి’ ఇటీవల రీరిలీజ్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. దీంతో సూపర్ స్టార్ కొడుకు గౌతమ్తో సీక్వెల్ రాబోతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలను డైరెక్టర్ కృష్ణవంశీ ఖండించారు. సీక్వెల్ ఆలోచన లేదని Xలో స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గౌతమ్ లండన్లో యాక్టింగ్పై శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
సూడాన్లోని ఓ గ్రామంలో పారామిలిటరీ బలగాలు 80 మందిని ఊచకోత కోశాయి. సిన్నార్ స్టేట్లోని జలక్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. తొలుత గ్రామానికి చెందిన యువతులను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పారామిలటరీ బలగాలు రెచ్చిపోయి గ్రామంలో రక్తపాతం సృష్టించాయి. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చివేశారు. దీనిపై RSF ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Sorry, no posts matched your criteria.