India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నలుగురు ముష్కరుల ఊహా చిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేస్తామని తెలిపారు. కథువా జిల్లాలో మచేడీలో పెట్రోలింగ్ చేస్తున్న ఐదుగురు సైనికులపై జులై 8న బురద ప్రాంతాల్లో దాక్కొని ఈ టెర్రరిస్టులు దాడి చేశారు. ఘటనలో ఒక జవాన్ మరణించారు. జులై 15న కూడా ఇలాంటి దాడే జరిగింది. జైష్ ఏ మహ్మద్ షాడో గ్రూపులే ఇలా చేస్తున్నాయని సమాచారం.
టీమ్ ఇండియా వన్డే/టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించారు. రోహిత్ చాలా మంచి మనిషంటూ ఆకాశానికెత్తేశారు. ‘ఆటగాడిగానే కాదు, మనిషిగానూ రోహిత్ అద్భుతం. తను మంచివాడు కాదని చెప్పిన ఒక్క వ్యక్తిని కూడా నేను చూడలేదు. 24 క్యారెట్ల బంగారం ఆయన’ అని కొనియాడారు. టీ20ఐ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఊళ్లపైకి వచ్చే అడవి ఏనుగుల్ని ఎదుర్కొనేందుకు కుంకీలుగా అధికారులు మగ ఏనుగుల్నే వాడుతుంటారు. ఎందుకంటే మగవి ఒంటరిగా అయినా ఉండగలవు కానీ ఆడఏనుగులు గుంపులో ఉండేందుకే ఇష్టపడతాయి. ఇక ఏనుగుల గుంపునకు ఆడ ఏనుగే నాయకురాలుగా ఉంటుంది. కుంకీ మగ ఏనుగు అడ్డుకోవడానికి రాగానే తమ పిల్ల ఏనుగుల రక్షణ కోసం మందను వెనక్కి తీసుకెళ్లిపోతుంది. ఒకవేళ గుంపులో మగ ఏనుగు ఉన్నా దానితో పోరాడేందుకు కుంకీ ఏనుగులు భయపడవు.
TG: వీధికుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘నిన్న వరంగల్లో పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై దాడి చేశాయి. ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారిని చంపేశాయి. 8 నెలల్లో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయి. హైకోర్టు హెచ్చరించినా మొద్దు నిద్ర వదలట్లేదు’ అని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పిక్టోగ్రామ్స్ అనేవి చిత్రలేఖనం ద్వారా సమాచారాన్ని అందించే చిహ్నాలు. వీటిని ఒలింపిక్స్లో మొదటిసారిగా జపాన్ (1964) ఉపయోగించింది. టోక్యో ఒలింపిక్స్లో ఇతర దేశాల క్రీడాకారులకు జపనీస్ అర్థం కాకపోవడంతో జపాన్ ఈ ఎత్తుగడ వేసింది. నిజానికి పిక్టోగ్రామ్స్ వాడకం 5 వేల ఏళ్ల క్రితం మెసొపొటేమియా, ఈజిప్ట్లో ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది.
బంగ్లాలో మైనారిటీ వర్గాలు తమ హక్కుల సాధనకై ఉద్యమించాయి. మైనారిటీ వర్గాల కోసం దేశంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని, దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పార్లమెంటు స్థానాల్లో మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢాకాలోని షాబాగ్ వేదికగా ఉద్యమించాయి.
టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణ చాలా రోజుల తర్వాత ఒకే వేదికను పంచుకోనున్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్లో గెస్ట్గా మెగాస్టార్ రాబోతున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు. ‘జనాన్ని చంపుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ హింస ఆగేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. SaveBangladesiHindus అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశారు.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన రెజ్లర్ అమన్ సెహ్రావత్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్ తరఫున అత్యంత చిన్న వయస్సులో పతకం గెలిచిన అమన్ సెహ్రవాత్కు కంగ్రాట్యులేషన్స్. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్ది. ప్రతి భారతీయుడూ మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు’ అని ట్వీట్ చేశారు.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.