India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: <<13805045>>సుంకిశాల<<>> ఘటనపై ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుంకిశాల విపత్తు విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలిస్తే ఎందుకు వారం రోజులు గోప్యత పాటించారు? తెలియకపోతే అది ప్రభుత్వానికే సిగ్గుచేటు. కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలి. దీనికి వందశాతం సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత్ 5 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 64వ స్థానంలో నిలవగా ఒకే ఒక్క పతకం గెలిచిన పాక్ మాత్రం 53వ స్థానంలో ఉంది. దీనికి ఓ కారణం ఉంది. గోల్డ్ మెడల్స్ ఆధారంగానే IOC పట్టికలో స్టాండింగ్స్ ఇస్తుంది. భారత్ ఖాతాలో ఒక్క స్వర్ణ పతకం కూడా లేకపోవడంతో పాక్ కన్నా వెనుకబడి ఉంది. 100 సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన దేశమైనా, ఒక్క గోల్డ్ మెడల్ గెలిచిన దేశం తర్వాతి స్థానాల్లోనే నిలుస్తుంది.
ఇటీవల కాలంలో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ML), బ్లాక్చైన్ వంటి సాంకేతికతలను వినియోగిస్తుండడంతో డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు ఇండీడ్ తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ రంగంలో 8.5 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఈ హైరింగ్ సంస్థ అంచనా వేసింది. అందులోనూ 70% సాఫ్ట్వేర్ ఆధారిత రంగాల్లోనే ఉండొచ్చని తెలిపింది.
AP: విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ‘విజయవాడపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు? అప్పట్లో బెజవాడ పరిసరాల్లో 40 గుడులను కూల్చావు. ఐదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా జగన్ బెజవాడ రూపురేఖల్ని మార్చారు. అది జీర్ణించుకోలేకనే కదా ఇలా విధ్వంసాలకు పాల్పడుతున్నావ్?’ అని ట్వీట్ చేసింది. చంద్రబాబు, జగన్ ఫొటోలను షేర్ చేసింది.
గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 పెరిగి రూ.70,090కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.750 పెరిగి రూ.64,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం వెండి రేటు కేజీ రూ.88,000గా ఉంది.
హోం లోన్ తీసుకొనే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ తీసుకుంటే లోన్ మొత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించే ప్రక్రియలో రుణగ్రహీత అకస్మాత్తుగా మరణిస్తే ఆ రుణభారం కుటుంబ సభ్యులపై పడకుండా బీమా సంస్థలు మిగిలిన రుణం మొత్తాన్ని బ్యాంకులకు కట్టేలా పాలసీ కాపాడుతుంది.
ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హీరో స్మగ్లింగ్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ‘పుష్ప’ మాత్రమే. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుష్ప అనేది పాత్ర మాత్రమేనని, బన్నీ నిజ జీవితంలో ఎప్పుడూ బాధ్యతగానే ఉన్నారని వారు చెబుతున్నారు. పవన్ పుష్పను ఉద్దేశించి అనలేదంటూ ఆయన ఫ్యాన్స్ వారికి కౌంటర్ ఇస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదని పాస్పోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆయన జైలులో ఉన్నారు.
కల్మషం లేని నవ్వు వారి సొంతం.. ఎవరికీ హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం. పచ్చని చెట్లను ప్రేమిస్తూ.. వన్య ప్రాణులను లాలిస్తూ.. అడవితల్లి ఒడిలో సేదదీరుతారు. మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే వనరులు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పెరుగుతున్న ప్రపంచీకరణతో వారి సంస్కృతి దెబ్బతింటోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 9న UNO ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటిన భారత హాకీ జట్టు తిరిగి పునర్వైభవం దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లను మట్టికరిపించి ఔరా అనిపించింది. హాకీకి ప్రాముఖ్యత తగ్గినప్పుడు 2018లో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ముందుకొచ్చి స్పాన్సర్గా వ్యవహరించింది. ప్లేయర్లకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులు అందజేసింది. దీంతో భారత హాకీ జట్టు తిరిగి గాడిన పడటమే కాకుండా పతకాలు అందుకుంటోంది.
Sorry, no posts matched your criteria.