India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

MNS చీఫ్ రాజ్ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.

తనపై దాడి జరిగినప్పుడు ఇంట్లో పరిస్థితిపై సైఫ్ అలీఖాన్ వివరించారు. ‘చిన్నకొడుకు జెహ్ రూమ్లోకి ప్రవేశించిన దుండగుడిని అడ్డుకోగా నాపై కత్తితో దాడి చేశాడు. వెంటనే కరీనా, తైమూర్ వచ్చారు. నాన్న నువ్వు చనిపోతున్నావా అని తైమూర్ అమాయకంగా అడగ్గా, లేదని చెప్పా. కరీనా కొందరికి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు వారు చాలా భయపడ్డారు. అనంతరం తైమూర్తో కలిసి ఆస్పత్రికెళ్లా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

TG: ఫిరాయింపు <<15413173>>ఎమ్మెల్యేలపై<<>> అనర్హత వేటు వేయాలని KTRతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకరు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం విచారణను ఈ నెల 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

పంజాబ్ CM భగవంత్ మాన్, ఎమ్మెల్యేలతో AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ఢిల్లీలో సమావేశం అవుతారని తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 30కి పైగా MLAలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్, BJP నేతలు బాహాటంగానే చెప్తున్నారు. పైగా శాంతిభద్రతలు, టెర్రరిజం, డ్రగ్ మాఫియా అంతంపై అమిత్ షా డైరెక్షన్లో మాన్ పనిచేస్తున్నారు. దీంతో కేజ్రీకి చీలిక భయం పట్టుకుంది.

విభిన్న కథాంశాలతో హీరో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇవాళ సా.4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను చిత్రయూనిట్ పంచుకుంది. ఓ చేతిలో రేడియోతో గొంగిడి కప్పుకొని నడుచుకుంటూ వస్తున్న విష్ణు లుక్ ఆకట్టుకుంటోంది.

బెంగళూరు ‘ఏరో ఇండియా’ మెగా ఈవెంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి రష్యన్ Su-57, అమెరికన్ F-35 లైటెనింగ్ 2 విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఆయా దేశాలు తలమానికంగా భావించే ఈ స్టెల్త్ ఫైటర్స్ను ఒకదానికొకటి పోటీగా భావిస్తారు. సాధారణంగా Su-57 కొనే దేశాలకు F-35ని విక్రయించరు. భారత్ అతిపెద్ద మార్కెట్ కావడంతో ఇక్కడ ప్రదర్శనకు ఉంచినట్టు తెలిసింది. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలూ వచ్చాయి.

ఆధార్ ఒక కాస్ట్లీ మిస్టేక్ అని Hotmail కోఫౌండర్ సబీర్ భాటియా పేర్కొన్నారు. ‘$1.3 బిలియన్లతో చేసిన ఈ ప్రాజెక్టును కేవలం $20 మిలియన్లతో చేయొచ్చు. ఆధార్ మీ బయోమెట్రిక్స్ అన్నింటినీ తీసుకుంది. కానీ దానిని ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా? ఇప్పటికే ప్రతి స్మార్ట్ఫోన్లో వీడియో, వాయిస్ ప్రింట్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఖర్చుతో మరింత వినూత్నంగా చేసే అవకాశం ఉండేది’ అని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ స్పందించారు. ‘కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిన సానుభూతి, విషెస్, మీ మాటలు నాకు అపారమైన శక్తినిచ్చాయి’ అని పేర్కొన్నారు. కాగా, పవన్ కొన్ని రోజులుగా స్పాండిలైటిస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.62.37 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. యువసామ్రాట్ చైతూ కెరీర్లో ఇవే అత్యంత వేగవంతమైన కలెక్షన్లని తెలిపింది. ఈ సినిమాలో మ్యూజిక్తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.