news

News August 8, 2024

కట్టుబట్టలతో ఇండియాకు.. రూ.30వేలతో షాపింగ్!

image

ఆందోళనకారుల హింస మధ్య అకస్మాత్తుగా దేశాన్ని వీడిన బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో ఇండియాకు వచ్చారు. ప్రాణ భయంతో దుస్తులు, వ్యక్తిగత వస్తువులు సైతం వెంట తెచ్చుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో హసీనా యూపీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో రూ.30వేలతో షాపింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈరోజు ఆమె లండన్ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News August 8, 2024

మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత

image

AP: సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈయన టీడీపీ నుంచి 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

News August 8, 2024

సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు, సౌకర్యాలు వినేశ్‌కు అందిస్తాం: సీఎం

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ అధిక బరువు కారణంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో ఆడకపోయినా ఆమె ఛాంపియనేనని హరియాణా సీఎం నయాబ్ సైనీ కొనియాడారు. ఆమెను చూసి గర్విస్తున్నామన్నారు. ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు Xలో తెలిపారు. ఒలింపిక్ రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్‌కు అందిస్తామని ప్రకటించారు.

News August 8, 2024

హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు?

image

TG: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా బంగ్లా నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది.

News August 8, 2024

పవన్ కళ్యాణ్ అభిమానులకు GOOD NEWS!

image

డిప్యూటీ సీఎం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన నటిస్తున్న 3 సినిమాల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. తాజాగా OG నిర్మాత DVV దానయ్య పవర్ స్టార్‌ను కలిసి డేట్స్‌పై చర్చించారు. OCT నుంచి షూటింగ్‌లో పాల్గొంటానని నిర్మాతకు పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సమయాన్ని బట్టి హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 8, 2024

చరిత్రలో తొలిసారి.. స్పిన్ ఉచ్చులో భారత్ విలవిల

image

T20WC విజయం తర్వాత జోరుమీదున్న టీమ్ ఇండియాకు శ్రీలంక బ్రేక్ వేసింది. 3 వన్డేల్లోనూ పైచేయి సాధించింది. ముఖ్యంగా లంక స్పిన్నర్లు అదరగొట్టారు. ప్రతి మ్యాచ్‌లో 9 వికెట్ల చొప్పున 27 వికెట్లు కూల్చేశారు. ఈ 3 వన్డేలూ కొలొంబోలోనే జరగడం విశేషం. ఒక సిరీస్‌లో స్పిన్‌కు అన్ని వికెట్లు కోల్పోవడం ODI చరిత్రలో ఇదే తొలిసారి. అదే గ్రౌండులో భారత్ గతేడాది 10 వికెట్లు, 1997లో 9 వికెట్లు స్పిన్నర్లకు సమర్పించుకుంది.

News August 8, 2024

హత్య కేసులో హీరో దర్శన్‌పై ఛార్జ్‌షీట్?

image

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో <<13490637>>దర్శన్<<>> సహా 17 మందిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ ప్రభుత్వాన్ని కోరింది. అక్కడి నుంచి అనుమతి రాకపోతే ప్రస్తుతం విచారణ జరుగుతున్న సివిల్ కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.

News August 8, 2024

మెడల్ సాధించకపోయినా రూ.25,00,000 రివార్డ్

image

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వినేశ్ ఫొగట్‌కు రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. వినేశ్ మెడల్ గెలిచినట్లేనని వర్సిటీ ఛాన్స్‌లర్ అశోక్ తెలిపారు. ‘వినేశ్ మా యూనివర్సిటీలో MA (సైకాలజీ) స్టూడెంట్. ఆమె దృఢ సంకల్పం, స్కిల్ చాలా గొప్పవి’ అని ఆయన చెప్పారు. తమ విద్యార్థులు గోల్డ్ గెలిస్తే రూ.50 లక్షలు, సిల్వర్‌కు రూ.25 లక్షలు, బ్రాంజ్ గెలిస్తే రూ.10 లక్షలు ఇస్తామని గతంలో LPU ప్రకటించింది.

News August 8, 2024

రష్యాలోకి ఉక్రెయిన్ దళాలు.. భీకర దాడి

image

రెండేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో అంకానికి చేరింది. ఉక్రెయిన్ దళాలు కుర్స్క్ రీజియన్ ద్వారా తమ దేశంలో ప్రవేశించి దాడులు చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రెచ్చగొట్టడంలో భాగంగానే ఈ చొరబాట్లు అని పుతిన్ మండిపడ్డారు. ప్రజల నివాసాలు, అంబులెన్సులపై క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ ఆర్మీ బోర్డర్ దాటడం ఇదే తొలిసారి. దీనిపై జెలెన్‌స్కీ ఇంకా స్పందించలేదు.

News August 8, 2024

గుండెపోటు మరణాలకు చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: గుండెపోటు వచ్చినప్పుడు గోల్డెన్ అవర్(తొలి గంట) కీలకం. ఆ టైంలో ‘టెనెక్ట్‌ప్లేస్’ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాథమిక చికిత్స అందిస్తే రోగి ప్రాణాలు కాపాడొచ్చు. ఇందుకోసం CHC, ఏరియా ఆస్పత్రులను GOVT వైద్య కాలేజీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ఈ కార్యక్రమాన్ని CM చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నారు. టెనెక్ట్‌ప్లేస్‌ ప్రభుత్వానికి ₹19వేలకు సరఫరా అవుతోండగా ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నారు.

error: Content is protected !!