India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘పోకిరి’ లాంటి సినిమా చేయాలని ఉందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘పోకిరి’ తనకు టెక్ట్స్ బుక్ వంటిదని చెప్పారు. ఇప్పటివరకూ మహేశ్కు స్టోరీ ఏమీ చెప్పలేదన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్-రవితేజ కాంబినేషన్లో సినిమా తీయాలని ఉందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవని, తన స్టైల్ సినిమాలు చేస్తానని తెలిపారు.
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ DELL సేల్స్ విభాగంలోని 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. AIపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో పాటు వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోల్పోయిన వారిలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఉన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి ఈ విషయాన్ని మెమోలో తెలియజేసినట్లుగా పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్లో పతకం ఖాయమనుకున్న భారత ప్లేయర్లు గెలుపు అంచులదాకా వెళ్లి ఆగిపోతున్నారు. ఈ సీజన్లో షూటింగ్లో మనూ భాకర్, అర్జున్, ఆర్చరీలో ధీరజ్-అంకిత ద్వయం, స్కీట్ షూటింగ్లో అనంత్ జీత్& మహేశ్వరి జోడీ, బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం ఒక్క స్థానంతో పతకాన్ని కోల్పోవడం ఆటగాళ్లతో పాటు అభిమానులకు హార్ట్ బ్రేకింగ్గా మారింది.
‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ సినిమాల జోరు పెంచారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాను అధికారంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై VS14ను నిర్మించినట్లు పేర్కొన్నారు. విశ్వక్ ఇప్పటికే మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తుండగా ఇటీవలే VS13ను ప్రకటించారు. మరోవైపు వినోదాత్మక చిత్రాల తీసే అనుదీప్ మూవీలో విశ్వక్ నటించనుండటంతో వీరిద్దరి కాంబినేషన్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్ అక్రిడేషన్ను ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్(IOA) రద్దు చేసింది. అంతిమ్ అక్రిడేషన్ కార్డుతో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడమే దీనికి కారణం. అక్రమంగా ప్రవేశించిన నిశాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపటికే విడుదల చేశారు. పోలీసుల ఫిర్యాదుతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని అంతిమ్ను టీమ్తో సహా భారత్ పంపనున్నట్లు IOA పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న వయనాడ్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కన్నూర్ వెళ్లనున్న ఆయన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తారని సమాచారం. అనంతరం ఈ ఘటనతో నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో ఆవాసం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. కాగా వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచారు. వెయిట్ లిఫ్టింగ్లో 49 కేజీల విభాగంలో ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్లో మీరా రజతం గెలిచారు. మరోవైపు 3000m స్టీపుల్ ఛేజ్లో భారత అథ్లెట్ అవినాశ్ 11వ స్థానంలో నిలిచారు.
1870: అవధాన విద్యకు ఆద్యుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జననం
1907: ప్రముఖ శతావధాని అనుముల వెంకటశేషకవి జననం
1981: ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ జననం
1987: స్వాతంత్ర్య సమరయోధులు, కవి గురజాడ రాఘవశర్మ మరణం
1994: ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చాను జననం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
అధిక బరువు ఉన్నారనే కారణంతో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ క్రీడా కోర్టు(CAS)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఫైనల్కు చేరడంతో సిల్వర్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. తనను ఎలిమినేట్ చేయడం సరికాదని పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై కోర్టు ఇవాళ ఉదయం తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే ఫైనల్లో ఓడిన రెజ్లర్తో వినేశ్ రజతం అందుకునే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.