news

News August 3, 2024

SGB స్కీమ్: కేంద్రం షాకివ్వనుందా?

image

సావరిన్ గోల్డ్ బాండ్స్. చాలామందికి ఇష్టమైన స్కీమ్. ఏటా 2.5% వడ్డీ, మెచ్యూరిటీ తీరాక గోల్డ్‌కు సమాన రాబడి, LTCG వర్తించకపోవడం దీని బెనిఫిట్స్. అయితే ప్రభుత్వం దీన్ని నిలిపేయొచ్చని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఫిజికల్ గోల్డుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ పూడ్చుకొనేందుకు SGBపై పెడుతున్న ఖర్చు ఎక్కువగా ఉందట. పైగా ఇది సోషల్ సెక్టార్ స్కీమ్ కాదు. కొన్నిరోజుల్లో స్పష్టత రావొచ్చు.

News August 3, 2024

Olympics: మనసులు గెలిచావ్ మనూ..

image

25మీ. పిస్టల్ షూటింగ్‌లో 4వ <<13767925>>స్థానంలో<<>> నిలవడం బాధగా ఉందని ఈవెంట్ తర్వాత మనూ భాకర్ తెలిపారు. పతకం గెలిచి ఉంటే బాగుండేదన్నారు. అయితే భారత్ ఇప్పటివరకు సాధించిన 3 పతకాల్లో 2(వ్యక్తిగత, మిక్స్‌డ్) ఆమె గెలుచుకున్నవే. మిగతా ఈవెంట్లలో భారత ప్లేయర్లంతా పతకాల కోసం చెమటోడుస్తుండగా, అంతర్జాతీయ వేదికపై ఆమె భారత జెండాను రెపరెపలాడించారు. కోట్లాది మంది భారతీయుల మనసులు గెలుచుకున్నారు.

News August 3, 2024

భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిందా..?

image

ఈ ఏడాది భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. దేశం నలుదిక్కులా విపత్తులు వణికించాయి. ఇంకా వణికిస్తున్నాయి. ఏపీని వరదలు ముంచెత్తాయి. కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్‌ కారణంగా వరద ఊళ్లను తుడిచిపెట్టేసింది. రెమాల్ తుఫానుతో ఈశాన్య రాష్ట్రాలు, బిపర్‌జాయ్ తుఫానుతో గుజరాత్‌ అతలాకుతలమయ్యాయి. ఢిల్లీ, ముంబై నగరాలు వరదతో విలవిలలాడాయి.

News August 3, 2024

SPECIAL: అరుదైన చిరుతపులి

image

కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్ రిజర్వ్‌లో అరుదైన చిరుత పులి కనిపించింది. రెండు వేర్వేరు రంగులు కలిగిన కళ్లతో ఉన్న ఈ చిరుతపులిని ఫొటోగ్రాఫర్ ధ్రువ్ పాటిల్ తన కెమెరాలో బంధించారు. సఫారీలో పాల్గొన్న ఆయన చెట్టుపై ఉన్న చిరుతను ఫొటో తీసి గమనించగా ఓ కన్ను నీలం- ఆకుపచ్చ, మరోటి గోధుమ రంగుతో కనిపించాయి. హెటెరోక్రోమియా వల్ల ఇలా కళ్ల రంగు మారి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

News August 3, 2024

ఆ అధికారులను వదిలిపెట్టను: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో భూ అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ప్రజాదర్బార్‌లో సీఎం మాట్లాడారు. ‘రెవెన్యూ సమస్యలపైనే ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయి. మండలానికో భూ కుంభకోణం వెలుగులోకి వస్తోంది. వైసీపీ నేతలతో కలిసి కొంతమంది అధికారులు రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News August 3, 2024

పతకాల పందెంలో ముందున్న దేశాలివే

image

ఒలింపిక్స్‌లో పతకాల వేటలో ఎప్పటిలాగే చైనా దూసుకుపోతోంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 3 కాంస్య పతకాలతో 47వ స్థానంలో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి 5 దేశాలను చూస్తే..
1. చైనా- 31 పతకాలు(13 గోల్డ్)
2. ఫ్రాన్స్- 35 పతకాలు(11 గోల్డ్)
3. ఆస్ట్రేలియా- 22 పతకాలు (11 గోల్డ్)
4. అమెరికా- 43 పతకాలు (9 గోల్డ్)
5. గ్రేట్ బ్రిటన్- 27 పతకాలు (9 గోల్డ్)

News August 3, 2024

బంగారు బాండ్లు: 122% లాభం

image

సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్టర్ల పంట పండబోతోంది. వారికి ఏకంగా 122% రాబడి వస్తోంది. 2016, ఆగస్టులో గ్రాముకు రూ.3119 చొప్పున కేంద్రం వీటిని విడుదల చేసింది. 8ఏళ్లు కావడంతో 2024, ఆగస్టు 5 రిడెమ్షన్‌కు చివరితేదీగా RBI ప్రకటించింది. రిడెమ్షన్ ధరను గ్రాముకు రూ.6938గా లెక్కకట్టింది. అంటే విలువ రెట్టింపైంది. దీంతో పాటు మదుపరులకు ఏటా 2.5% వడ్డీ వచ్చింది. SGBపై LTCG వర్తించకపోవడం మరో సానుకూల అంశం.

News August 3, 2024

అంతులేని విషాదం.. 358 మంది మృతి

image

కేరళలోని వయనాడ్‌‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 358 మృతదేహాలను వెలికితీశారు. మరో 200 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. వారంతా కొండచరియల శిథిలాల కిందే ఉన్నట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఐదో రోజు కొనసాగుతుండగా బాధితులను గుర్తించేందుకు రాడార్లను వినియోగిస్తున్నారు. ఆర్మీ, NDRF, SDRFతో పాటు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

News August 3, 2024

ఎన్టీఆర్ భవన్‌లో వినతులు స్వీకరిస్తున్న చంద్రబాబు

image

AP: మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆయనకు వినతిపత్రాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడుతోంది. పలువురి నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన సీఎం, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

News August 3, 2024

కమలా హారిస్‌తో డిబేట్‌కు సిద్ధం: ట్రంప్

image

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌కు తాను సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెల 4న పెన్సిల్వేనియాలో జరిగే ఈ డిబేట్‌లో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే రోజు అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలో పాల్గొనాల్సి ఉందని, కానీ అది రద్దు కావడంతో దీనికి అంగీకరించానని వెల్లడించారు. కాగా ఈ డిబేట్‌లో పాల్గొనడంపై కమలా హారిస్ ఇంకా స్పందించలేదు.