news

News March 6, 2025

పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

image

AP: నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సూర్యారావుపేట, భవానీపురం, మన్యం(D) పాలకొండ పోలీసులు ఆయనపై PT వారెంట్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను విచారణ చేసేందుకు ఆదోని పోలీసులు కర్నూలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులూ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

News March 6, 2025

బీజేపీలోకి సీఎం రేవంత్‌ను ఆహ్వానిస్తాం: అరవింద్

image

TG: CM రేవంత్ BJPలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని BJP MP ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనను పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అనేది తన చేతుల్లో లేదన్నారు. రేవంత్‌ను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన అలా చేస్తే CM స్థాయిలో రేవంత్ చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అటు కేంద్రం నిధులిస్తున్నా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలను MP ఖండించారు.

News March 6, 2025

ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: మోదీ

image

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP, కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో NDA కూటమి విజయంపైనా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని NDA కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని భరోసా ఇచ్చారు.

News March 6, 2025

సింగిల్స్‌లో ‘కింగ్’.. కోహ్లీ

image

క్రికెట్‌లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్‌లో ఓ బ్యాటర్‌కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.

News March 6, 2025

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

image

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు జరుగుతాయి. అటు ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15కు ముందే ఒంటిపూట బడులు నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2025

బ్యాంకులకు RBI శుభవార్త

image

నిధుల్లేక నైరాశ్యంతో ఉన్న బ్యాంకులకు ఉత్తేజం తెచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2లక్షల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో రూ.1.9లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నెల 12, 18 తేదీల్లో రూ.1లక్షల కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.

News March 6, 2025

బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నైరాశ్యం!

image

KNR-ADB-NZB-MDK జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలను కైవసం చేసుకుని BJP జోష్‌లో ఉంది. రాష్ట్ర నేతలు సమష్టి కృషితో అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయి INC నైరాశ్యంలో పడిపోయిందని సమాచారం. అక్కడ ఏడుగురు మంత్రులు, 23 మంది MLAలు ఉన్నా అంతర్గత కలహాలు కొంపముంచాయని తెలుస్తోంది.

News March 6, 2025

ఈనెల 8న మహిళాశక్తి పాలసీ విడుదల

image

TG: ఈనెల 8న జరగనున్న మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పాలసీ విడుదల చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరేడ్‌‌ గ్రౌండ్‌లో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని, మజ్జిగప్యాకెట్లు అందించాలని అధికారులను ఆదేశించారు.

News March 6, 2025

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.

News March 6, 2025

మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు

image

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్‌కు రాకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.