India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో కరెంట్ షాక్ వల్ల నమోదవుతున్న మరణాలపై NCRB(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2015-2020 మధ్య ఏకంగా 72,000 మంది కరెంట్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏడాదికి సగటున 12,000 మంది, డైలీ 32 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట. ఇటీవల UPలో ఓ UPSC అభ్యర్థి హాస్టల్ వద్ద వర్షపు నీటిలో కరెంట్షాక్కు గురై మరణించిన ఘటన అందర్నీ కలచివేసింది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా నిలిచారు. 872 పాయింట్లతో రూట్ అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సన్(859) రెండో స్థానంలో ఉన్నారు. 3, 4, 5 స్థానాల్లో బాబర్ ఆజం(PAK), మిచెల్(NZ), స్మిత్(AUS) ఉన్నారు. ఇక 6వ స్థానంలో రోహిత్ శర్మ, 7లో హ్యారీ బ్రూక్(ENG), 8లో జైస్వాల్, 9లో కరుణరత్నే(SL), 10వ స్థానంలో కోహ్లీ ఉన్నారు.
AP: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్పై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
TG: సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్లోకి రమ్మని, తర్వాత ఆమె బీఆర్ఎస్లోకి మారారని మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ అన్నారు. ఆమె మోసానికి ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలి’ అని పేర్కొన్నారు. సభలో BRS సభ్యులకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు.
దివంగత బ్రిటన్ ప్రిన్సెస్ డయానా నగల విషయంలో ఆమె వారసులు విలియం, హ్యారీ మధ్య చిచ్చు రగిలిందని రచయిత రాబ్ జాబ్సన్ ‘కేథరిన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో తెలిపారు. ‘నటి మేఘన్ మార్కెల్ను హ్యారీ పెళ్లి చేసుకోవడం రాజకుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే తమ తల్లి నగల్ని మేఘన్కు ఇవ్వనని విలియం తేల్చిచెప్పారు. ఆ విభేదాల కారణంగానే హ్యారీ దంపతులు రాచరికాన్ని వదిలేసుకున్నారు’ అని వెల్లడించారు.
AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు AG పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగానే వీరు మీడియా సమావేశం నిర్వహించారని హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రెస్మీట్ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను SEP 9కి వాయిదా వేసింది.
TG: అధికారం లేకపోతే ప్రజలు కూడా అవసరం లేదన్నట్టు కేసీఆర్ వైఖరి ఉందని మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ అన్నారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? అధికార పక్షానికి మేం సరిపోతాం అని కేటీఆర్ అంటున్నారు. మరి కేసీఆర్ ఎందుకు? ఫ్లోర్ లీడర్గా కేటీఆర్ ఉండొచ్చు కదా. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి’ అని విమర్శించారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తోందని తెలిపారు.
ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు IAS అభ్యర్థుల మృతి కేసులో SUV కారు నడిపిన బిజినెస్మ్యాన్ మను కతురియాకు బెయిల్ ఇచ్చేందుకు సిటీ కోర్టు నిరాకరించింది. కాగా అతివేగంగా కారు నడపడం వల్లే వరద నీటిలో అలలు ఏర్పడి కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరిందని పోలీసులు కతురియాను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు.
పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రష్యా కిరాయి సైన్యాన్ని అక్కడి తిరుగుబాటుదారులు కిరాతకంగా చంపారు. వాగ్నర్ గ్రూప్కు చెందిన 50మందిని చంపేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ ఇచ్చిన సమాచారంతోనే రెబల్స్ ఈ దాడి చేసినట్లు తెలిపింది. పట్టుబడ్డ 15 మంది ఫైటర్లను ఉక్రెయిన్కు అప్పగించనున్నారట. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధంలోనూ ఈ కిరాయి సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్-2024లో ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించగా క్రీడాభిమానులు గోల్డ్ మెడల్ కోసం ఎదురుచూస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుండగా 8న ఫైనల్స్ ఉంటుంది. దీంతో చోప్రాకు ALL THE BEST చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.