news

News July 29, 2024

ALERT: వణికిస్తున్న ఒరోఫూట్స్ వైరస్

image

దోమకాటుతో సోకే ఒరోఫూట్స్ వైరస్ 5 దేశాలను వణికిస్తోంది. బ్రెజిల్, బొలీవియా, పెరూ, క్యూబా, కొలంబియాలో ఈ ఏడాది 7700 కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్రెజిల్లోనే 7236 మందికి సోకింది. తాజాగా ఇద్దరు మరణించడంతో ప్రమాద ఘంటికలు మోగాయని అక్కడి అధికారులు భయపడుతున్నారు. ఈ రోగుల్లో తీవ్ర జ్వరం, వణుకుడు, తల, కీళ్ల నొప్పి సహా డెంగ్యూ లక్షణాలు ఉంటాయి. కొందరిలో చిగుళ్లు, ముక్కులోంచి రక్తం కారుతుంది. ఇది అంటువ్యాధి కాదు.

News July 29, 2024

గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని CM చంద్రబాబు అన్నారు. ‘పట్టాదారు పాసుపుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం. వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదనేది ప్రజాభిప్రాయం. అందుకే రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండవు’ అని ట్వీట్ చేశారు.

News July 29, 2024

పెరగనున్న చెప్పులు, షూల ధరలు!

image

కస్టమర్లకు నాణ్యమైన పాదరక్షలు అందించాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సంస్థలు తయారు చేసే చెప్పులు, షూలు AUG1 నుంచి కెమికల్, క్వాలిటీ టెస్టుల్లో పాస్ కావాల్సిందేనని BIS చెప్పింది. కాగా ఆ భారం తగ్గించుకునేందుకు సంస్థలు ధరలు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే తయారైన పాదరక్షల ధరల్లో మార్పు ఉండదు. రూ.50కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలను మినహాయించింది.

News July 29, 2024

CA ఫలితాలు విడుదల

image

ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) ఫౌండేషన్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 20, 22, 24, 26 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, జులై 11న సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. https://icai.nic.in/caresult/

News July 29, 2024

బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో కృతి సనన్?

image

హీరోయిన్ కృతి సనన్ బిజినెస్‌మ్యాన్ కబీర్ బహియాతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా వీరిద్దరూ గ్రీస్‌లో ఒకే ఈవెంట్‌లో కనిపించారు. ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఫొటోను కబీర్ సోషల్ మీడియాలో లొకేషన్‌తో సహా పోస్ట్ చేశారు. అదే లొకేషన్‌లో కృతి ఉన్నట్లు తేలింది. దుబాయ్‌లో 2024 న్యూఇయర్ వేడుకల్లోనూ వీరిద్దరూ కలిసి కెమెరాకు చిక్కారు.

News July 29, 2024

కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం.. కేసు సీఐడీకి బదిలీ

image

TG: కమర్షియల్ ట్యాక్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ.1,000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాజీ సీఎస్, అప్పటి వాణిజ్య పన్నుల కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు.

News July 29, 2024

కూతురికి తండ్రి హగ్ ఇవ్వొద్దా? చిన్మయి పోస్టుపై భిన్నాభిప్రాయాలు!

image

సింగర్ చిన్మయి ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నా భర్త రాహుల్ రెండేళ్ల కూతురిని హగ్ చేసుకుందామనుకుంటే ఆమె నో చెప్పింది. అప్పటి నుంచి అతడు హగ్ చేసుకోవట్లేదు. నేను అందరు పిల్లలకు ఇదే నేర్పుతున్నా. బుగ్గలు గిల్లాలన్నా పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటా’ అని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పడంలో తప్పు లేదని కానీ తండ్రి హగ్ చేసుకున్నా ఇలా చేయడమేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News July 29, 2024

విజయమ్మతో భేటీలో రాజకీయ కోణం లేదు: జేసీ ప్రభాకర్

image

AP: వైఎస్ విజయమ్మతో జరిగిన భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాను. అక్కడ వెయిటింగ్ లాంజ్‌లో విజయమ్మ కనిపించారు. ఆమెను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నాను’ అని Xలో పేర్కొన్నారు. వీరి భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

News July 29, 2024

గోదావరి స్వరూపం తెలుసా?

image

దక్షిణ గంగగా పేరొందిన గోదావరి మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ, ఏపీ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై MHలో జయక్వాడీ, బాబ్లీ, తెలంగాణలో శ్రీరాంసాగర్, కడెం, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీలో పోలవరం పూర్తయితే అది అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించనుంది. ఈ నదికి ప్రాణహిత నుంచి భారీ ప్రవాహం వస్తుంది. ఈ నది ఒడ్డున నాసిక్, బాసర, ధర్మపురి, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి.

News July 29, 2024

ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.