India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచులో 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 13 పాయింట్లు రాబట్టడం గమనార్హం. ప్రో కబడ్డీ లీగ్లో పవన్ రికార్డు స్థాయిలో 1,200 పాయింట్లు సాధించారు. మరోవైపు రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విషయంలో TG CM రేవంత్ రెడ్డి దార్శనికతకు, నాయకత్వానికి దోహదపడటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘మన యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక మరింత సుసంపన్నమైన భారత్ను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాల్ని మేం వెలికి తీస్తున్నాం. తరతరాలను ఉద్ధరించనున్నాం’ అని పేర్కొన్నారు. వర్సిటీ ఏర్పాటుకోసం ఆయన సీఎం రేవంత్కి రూ.100 కోట్ల చెక్కు అందించారు.
TG:GO-55 ప్రకారం 1 JOBకి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని సెలక్ట్ చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులనే ఎంచుకుంటారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటా, ఓపెన్లోనూ ఛాన్సుంటుంది. GO 29 ప్రకారం ఓపెన్లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేషన్లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
TG: గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. సీఎం ఆదేశాలతో నిరుద్యోగులపై పోలీసులు జులుం చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు BRS అండగా ఉంటుందని KTR భరోసా ఇచ్చారు. అటు అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా టుంజుంగ్ చేతిలో 13-21, 21-16, 9-21 తేడాతో ఆమె పరాజయంపాలయ్యారు. ఆమె ఓటమితో ఈ టోర్నీ నుంచి భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మిగిలిన అన్ని విభాగాల్లోనూ భారత ప్లేయర్లు ముందే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.
తెలుగు టైటాన్స్ మాజీ కెప్టెన్, కబడ్డీ స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి ప్రొకబడ్డీకి వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి సీజన్ ప్రారంభం కానుండగా రాహుల్ కొత్త అవతారంలో కనిపించారు. కబడ్డీ అనలిస్ట్గా, హ్యాండ్సమ్ లుక్లో ఆయన దర్శనమిచ్చారు. 31 ఏళ్ల రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.
AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.
తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేలా చేయడానికి PCB శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా BCCI ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. పాక్లో ఉండటానికి భద్రతాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయనుకుంటే IND ఆడే ప్రతి మ్యాచ్ తర్వాత తిరిగి చండీగఢ్ లేదా ఢిల్లీకి వెళ్లిపోవచ్చని చెప్పినట్లు cricbuzz తెలిపింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ వెళ్లేది లేదని అంటున్న BCCI, PCB ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో?
ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఆ కథనం ప్రకారం.. భారత్లోనే కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల భారత ఐటీ హార్డ్వేర్ పరిశ్రమ ఇబ్బంది పడొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతులపైనే హార్డ్వేర్ పరిశ్రమ ప్రధానంగా ఆధారపడింది.
TG: స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయడంపై BC కమిషన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నెల 28న ADB, 29న NZB, 30న SRD, నవంబర్ 1న KRMR, 2న WGL, 4న NLG, 5న ఖమ్మం, 7న RR, 8న MBNR, 11న HYDలో జిల్లా కలెక్టరేట్/ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల్లో విచారణలు చేయనుంది. నవంబర్ 11న ప్రత్యేకంగా NGOలు, సంస్థలు మరియు కుల/సంక్షేమ సంఘాలతో భేటీ కానుంది.
Sorry, no posts matched your criteria.