India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడులను అరికట్టడానికి వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. GOVT ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్యవేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటుచేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్ పాస్ అందించనుంది. వైద్యుల రక్షణకు కమిటీలు ఏర్పాటుచేయనుంది.
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కేటీఆర్ సోమవారం నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునరుజ్జీవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించనున్నారు.
ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్లకు సంబంధించి ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
MI: రోహిత్, బుమ్రా, సూర్య, హార్దిక్
DC: పంత్, అక్షర్, జేక్/కుల్దీప్, PBKS: అర్ష్దీప్
LSG: పూరన్, మయాంక్ యాదవ్, బదోని/మోహ్సిన్
CSK: జడేజా, రుతురాజ్, దూబే, ధోనీ
GT: గిల్, రషీద్, SRH: కమిన్స్, అభిషేక్, క్లాసెన్
RR: శాంసన్, పరాగ్, జురెల్
KKR: శ్రేయస్, రసెల్, నరైన్
RCB: కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. FIIలు వెళ్లిపోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎర్లీ ట్రేడ్లో సెన్సెక్స్ 80,764 (-233), నిఫ్టీ 24,595 (-54) వద్ద ట్రేడవుతున్నాయి. నిన్న సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్న ఆటో షేర్లు నేడు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ను ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకుంటున్నారు. INFY, BPCL, TITAN టాప్ లూజర్స్.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుండగా, <<14354965>>ఇండియా-A<<>> తన తొలి మ్యాచులో రేపు పాక్-Aతో తలపడనుంది. ఒమన్ వేదికగా రేపు రా.7కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, అఫ్గాన్, బంగ్లా జట్లు తమ A టీమ్లను బరిలోకి దింపగా, UAE, ఒమన్, హాంకాంగ్ తమ సీనియర్ జట్లను ఆడిస్తున్నాయి. ఈ మ్యాచులను ఫ్యాన్కోడ్ యాప్లో చూడవచ్చు.
AP: ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో మూసేసిన తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. యథావిధిగా భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం కొండపై 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని వారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,956 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చింది.
న్యూజిలాండ్తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మూడో రోజు అతడు వికెట్ కీపింగ్ చేయడని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. అతని స్థానంలో జురెల్ కీపింగ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం మూడో రోజు ఆట ఆరంభమైంది. NZ (188/3) ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.
జేఈఈ మెయిన్ నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇక నుంచి సెక్షన్ Bలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా సమయంలో విద్యార్థులకు రిలీఫ్ ఇచ్చేందుకు 2021లో ఛాయిస్ విధానాన్ని తెచ్చింది. సెక్షన్ Bలో 10 ప్రశ్నలకు ఐదింటికి ఆన్సర్స్ రాయాల్సి ఉండేది. 2024 వరకు దీన్ని కొనసాగించారు. 2025 నుంచి 5 క్వశ్చన్సే ఇస్తామని, అవన్నీ రాయాల్సి ఉంటుందని వివరించింది.
భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఆఫీసర్ వికాస్ యాదవ్పై అమెరికా అభియోగాలు మోపింది. న్యూయార్క్లో ఖలీస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూను హతమార్చేందుకు వికాస్ కుట్ర చేశారని FBI పేర్కొంది. ఇందుకోసం నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, గతేడాది అతడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమిస్తామని భారత్ చెప్పగా.. అమెరికా సంతృప్తి వ్యక్తం చేసింది.
AP: రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.