news

News September 7, 2024

SEP 12న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘మిస్టర్ బచ్చన్’

image

రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఇది రిలీజ్ అవుతుంది. ఆగస్టు15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు.

News September 7, 2024

హత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చేయాలా?.. సీబీఐపై జడ్జి ఆగ్రహం

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు విచారణకు సీబీఐ తరఫు లాయర్ 40 నిమిషాలు ఆలస్యంగా హైకోర్టుకు వచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది సీబీఐ అలసత్వానికి నిదర్శనం. చాలా దురదృష్టకరం. నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ మంజూరు చేయమంటారా?’ అని మండిపడ్డారు. చివరికి వాదనలు విన్న జడ్జి నిందితుడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపారు

News September 7, 2024

అడగకుండా మామిడాకులు కోశాడని..

image

AP: వినాయక చవితి వేళ దారుణం జరిగింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో అర్జునరావు అనే వ్యక్తి మామిడాకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే అడగకుండా ఎందుకు కోస్తున్నావంటూ ఇంటి యజమాని అతడితో గొడవకు దిగాడు. వాగ్వాదం పెరగడంతో అర్జునరావుపై యజమాని కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

News September 7, 2024

ఈ నెల 10న ‘దేవర’ ట్రైలర్

image

‘దేవర’ ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

News September 7, 2024

గణేశ్ మండపాలు ఈ దిశలో అస్సలు వద్దు!

image

గణేశ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే చాలామంది యువతకు ఏ దిశలో విగ్రహం పెట్టాలనే సందేహం ఉంటుంది. వాస్తు ప్రకారం వినాయకుడిని తూర్పు దిశలో ప్రతిష్ఠించడం వల్ల మంచి శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు. తూర్పున సాధ్యం కాకపోతే ఉత్తరం వైపు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అయితే యముని స్థానమైన దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదంటున్నారు.

News September 7, 2024

అఖండ-2: బాలయ్య విలన్‌గా గోపీచంద్?

image

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్‌లో మరో మూవీ పట్టాలెక్కనుంది. ఇది అఖండ-2 అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విలన్‌గా గోపీచంద్‌ను తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు స్టోరీ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ముగ్గురు కాంబోలో మూవీ వస్తే క్రేజీగా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో జయం, నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ విలనిజం పండించారు.

News September 7, 2024

వాట్సాప్‌లో త్వరలో సూపర్ ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ తెలిపారు. అలాగే స్టేటస్‌లలో ఫ్రెండ్స్(కాంటాక్ట్స్)ను ట్యాగ్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్లను డెవలప్ చేస్తున్నామని, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.

News September 7, 2024

రావి నారాయణ రెడ్డికి CM రేవంత్ నివాళులు

image

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సంస్కర్త రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా నేడు CM రేవంత్ నివాళులర్పించారు. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కల్పించడంలో రావి నారాయణ రెడ్డి సేవలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. భారత దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక ఓట్లతో గెలిచి రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించారని సీఎం పేర్కొన్నారు.

News September 7, 2024

నీ రేటు ఎంత? నీ ఒడిలో నిద్రపోవాలి.. హీరోయిన్‌కు రేణుకా స్వామి మెసేజ్‌లు

image

కర్ణాటకలో రేణుకాస్వామి <<13484886>>హత్య<<>> కేసుపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ‘అతను ఇన్‌స్టాలో మరో పేరుతో హీరోయిన్ పవిత్రా గౌడకు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు పంపాడు. నీ రేటు ఎంత? నిన్ను పోషిస్తా. హీరో దర్శన్‌ను వదిలేసి రా. నీ ఒడిలో నిద్రపోవాలి అని మెసేజ్‌లు పంపడంతో హీరోయిన్ కోపోద్రిక్తురాలైంది. అతడిని ట్రాప్ చేసి హీరో దర్శన్ సాయంతో దారుణంగా చంపేసింది’ అని పోలీసులు పేర్కొన్నారు.

News September 7, 2024

మాజీ సీఎంపై గ్యాంగ్‌స్టర్ భార్య పోటీ

image

హరియాణాలో కాంగ్రెస్‌ కీలక నేతను ఎదుర్కొనేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. గార్హీ నుంచి పోటీలో ఉన్న మాజీ CM భూపిందర్ సింగ్ హుడాపై గ్యాంగ్‌స్టర్ రాజేశ్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపింది. మాజీ DSP ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. భర్త గ్యాంగ్‌స్టర్, తండ్రి సీనియర్ పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసొస్తుందని BJP భావిస్తోంది. OCT 5న ఎన్నికలు జరగనున్నాయి.