India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, NTR జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు పడతాయంది.
AP: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న బృందాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. వరద బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
AP: వరదల్లో మునిగి దెబ్బతిన్న వాహనాలకు ఫుల్ ఇన్సూరెన్స్ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాసేపట్లో బ్యాంకర్లు, బీమా కంపెనీ ప్రతినిధులతో CM CBN భేటీ కానున్నారు. బీమా చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు పక్కనపెట్టి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరనున్నారు. కాగా వరదల్లో లక్షల సంఖ్యలో కార్లు, టూవీలర్లు నీటమునిగాయి. దీంతో కొందరు వాహనదారులు రిపేర్ల కోసం మెకానిక్ షెడ్లకు క్యూకట్టారు.
AP: బాపట్ల జిల్లా వేమూరులో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. నియోజకవర్గంలో నీట మునిగిన పంటల పొలాలు, వరద బారిన పడ్డ ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. వేమూరు మార్కెట్ యార్డు హెలిప్యాడ్ను మంత్రులు అనగాని, గొట్టిపాటి, ఇతర అధికారులు ఇవాళ పరిశీలించారు.
గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 44.4 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 7 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గినట్లు పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 3.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని వెల్లడించింది.
హీరోయిన్ సమంత ఓ సినిమా షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది. ‘గాయాలు కాకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా?’ అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మోకాలికి సూదులతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను జత చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు. కాగా ఈ ఫొటోను చూసి ఆందోళన చెందుతున్న అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
IPL-2025కు జట్టులో భారీ మార్పులు చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రిటెన్షన్లను ఆ ఫ్రాంచైజీ వ్యతిరేకిస్తోంది. అందరూ వేలంలోకి వస్తే నచ్చిన ప్లేయర్లను కొనాలని ఆ జట్టు యోచిస్తోంది. కాగా శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించటంతో వచ్చే IPL ఆడేది అనుమానమే. ఇక ఆ జట్టులో కీలక ప్లేయర్లు జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, హర్షల్ పటేల్ను వదిలేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రేక్షకుల కోరిక మేరకు ఖడ్గం సినిమాను గాంధీజయంతి రోజున రీ-రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ‘VANDEMATRAM. మీ అందరూ ప్రేమతో ఇచ్చిన ఆజ్ఞ మేరకు నిర్మాత మధు మురళి గారు అక్టోబర్ 2న ఖడ్గం మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. మీరు మరోసారి ఉద్విగ్నంగా ఆదరిస్తారని ఆశిస్తూ.. వందేమాతరం, జైహింద్’ అని ట్విటర్లో పోస్ట్ పెట్టారు.
AP: బుడమేరుకు మళ్లీ వరద వస్తుందని, కట్ట తెగే ప్రమాదం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన జిల్లా ప్రజలను కోరారు. ‘ప్రస్తుతం బుడమేరుకు భారీ వరద రావడం లేదు. ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవు. మళ్లీ వరద వస్తే సమాచారం ఇస్తాం. సోషల్ మీడియాలో పుకార్లను ప్రజలు పట్టించుకోవద్దు’ అని ఆమె వెల్లడించారు.
మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీకి తాను తీసుకోవాల్సిన రెమ్యూనరేషన్లో రూ.4 కోట్లు తగ్గించుకున్నారని తెలుస్తోంది. రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో నిర్మాత TG విశ్వప్రసాద్కు తీవ్ర నష్టాలు వచ్చాయని టాక్. దీంతో రవితేజ ఈ నిర్ణయం తీసుకుని నష్టాన్ని కొంత భర్తీ చేశారని సమాచారం. మరోవైపు దర్శకుడు హరీశ్ కూడా రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చేశారని సమాచారం.
Sorry, no posts matched your criteria.