news

News September 4, 2024

సతీమణికి థాంక్స్ చెప్పిన చంద్రబాబు

image

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ₹2కోట్లు విరాళం ఇచ్చిన నారా <<14015209>>భువనేశ్వరికి<<>> CM చంద్రబాబు థాంక్స్ చెప్పారు. ‘వినాశకరమైన వరదల దృష్ట్యా AP, TG CMRFలకు చెరో రూ.కోటి విరాళమిచ్చిన నారా భువనేశ్వరి నేతృత్వంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన అనేక మందికి కృతజ్ఞతలు. ఈ కష్ట సమయాల్లో, ఇలాంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News September 4, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

AP: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో YCP నేతలకు ముందస్తు బెయిల్‌‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. TDP ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి, అవినాశ్, తలశిల రఘురాం, నందిగామ సురేశ్, జోగి రమేశ్, CBN నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితులుగా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు నుంచి మినహాయించాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరగా మధ్యాహ్నం నిర్ణయాన్ని వెల్లడించనుంది.

News September 4, 2024

బుడమేరుపై ఫేక్ ప్రచారం.. ఫైర్ అయిన లోకేశ్

image

AP: కరకట్ట సేఫ్టీ కోసమే బుడమేరు గేట్లు తెరిచారని కొందరు ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. ‘వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే, ప్రభుత్వం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే, సైకో జగన్ వికృతానందం చూడండి. బంగ్లాదేశ్ వరదల ఫోటోతో విజయవాడ వరదలు అంటూ ఫేక్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News September 4, 2024

పాక్‌పై విజయం.. బంగ్లా కెప్టెన్ ఫొటో వైరల్

image

పాకిస్థాన్‌పై గుర్తుండిపోయే టెస్టు సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఆ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో ఈ విజయం బంగ్లాదేశ్‌కు ఎంత విలువైందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News September 4, 2024

NK: వరద బాధితుల్ని కాపాడని అధికారులకు ఉరిశిక్ష!

image

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్‌ఉన్ 20-30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించారని ద.కొరియా మీడియా వెల్లడించింది. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్‌ వరదల్లో ప్రజలు చనిపోకుండా వారు కాపాడలేకపోవడమే ఇందుకు కారణం. జులైలో సంభవించిన ఈ విపత్తులో 1000+ మంది చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు, 7410 ఎకరాల వ్యవసాయభూమి, రోడ్లు, కట్టడాలు నీట మునిగాయని సమాచారం.

News September 4, 2024

VIRAL: గుండెల్ని పిండేసే ఫొటో

image

AP: విజయవాడలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో నెలలు నిండిన గర్భిణులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వరద చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఓ గర్భిణి వరద ప్రవాహంలోనే కష్టంగా నడుస్తున్న ఓ ఫొటో గుండెల్ని పిండేస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్లలో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు, 10 రోజుల్లో డెలివరీ అయ్యే 154 మందిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

News September 4, 2024

విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త

image

TG: కొత్తగా ఇళ్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్ బిగించుకోని వారికి ప్రభుత్వం రూ.825కే మీటర్లు ఏర్పాటు చేయనుంది. Sep 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి.

News September 4, 2024

వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: CS

image

TG: భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు.

News September 4, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. రీజన్ ఏంటంటే?

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, మదుపరులు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణాలు. 25,089 వద్ద మొదలైన NSE నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 25,095 వద్ద చలిస్తోంది. BSE సెన్సెక్స్ 511 పాయింట్లు పతనమై 82,026 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 5:45గా ఉంది. ఏషియన్ పెయింట్స్, BPCL, HUL, హీరోమోటో, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.

News September 4, 2024

బెజవాడలోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థ రావాల్సిందేనా?

image

AP: బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెజవాడ నీటమునిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్యతరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. క్రమక్రమంగా అవి పెద్దపెద్ద కాలనీలుగా విస్తరించాయి. దీంతో ఇక్కడా హైడ్రా తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?