news

News September 8, 2024

మీకు తెలుసా: పాస్‌పోర్టుకు 4వేల ఏళ్ల చరిత్ర!

image

పరాయి దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఇప్పుడేే కాదు 4వేల ఏళ్లకు పూర్వమే ఇలాంటి విధానం ఉంది. క్రీస్తుపూర్వం 2వేల ఏళ్లనాటికి చెందిన మెసపొటేమియావాసులు దేశం దాటేందుకు మట్టి పలకల రూపంలో గుర్తింపు కార్డుల్ని తీసుకెళ్లేవారని తవ్వకాల్లో వెల్లడైంది. పురాతన ఈజిప్టు, భారత నాగరికతల్లో లేఖల్ని తీసుకెళ్లేవారు. ఇక ఆధునిక పాస్‌పోర్టుల ప్రస్థానం మాత్రం మొదటి ప్రపంచయుద్ధం సమయంలో మొదలైంది.

News September 8, 2024

ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి

image

అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.

News September 8, 2024

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ బాబు?

image

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్‌ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

News September 8, 2024

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 8, 2024

మరో 3 జిల్లాల్లో రేపు సెలవు

image

APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

News September 8, 2024

ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్!

image

ఫోన్‌ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

News September 8, 2024

భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదు

image

భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంది. అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పరీక్షలకు పంపామంది. కాగా ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 926మంది మరణించారు.

News September 8, 2024

యూట్యూబ్ చూస్తూ వైద్యుడి సర్జరీ.. బాలుడి మృతి

image

బిహార్‌లో ఓ డాక్టర్ యూట్యూబ్‌ చూస్తూ సర్జరీ చేయడంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. అనారోగ్యంగా ఉన్న ఓ బాలుడిని(15) అతడి కుటుంబీకులు సరన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అజిత్ అనే వైద్యుడు వారి అనుమతి లేకుండానే బాలుడికి పిత్తాశయ సర్జరీని యూట్యూబ్‌లో చూస్తూ చేశాడు. అనంతరం బాలుడు చనిపోవడంతో సిబ్బందితో సహా పరారయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 8, 2024

ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం

image

AP: ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతుండటంతో గేట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడితో మాట్లాడిన ఆయన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించినట్లు కన్నయ్యనాయుడు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని, అయితే అది కష్టంతో కూడుకున్నది ఆయన వివరించారు.

News September 8, 2024

ALERT.. కాసేపట్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.