news

News September 13, 2024

మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి. పోర్టల్ పనిచేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన సర్వర్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని, మరో రెండు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

News September 13, 2024

ఇవాళ చంద్రబాబును కలవనున్న జూ.ఎన్టీఆర్

image

ఏపీ సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ భేటీ కానున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన రూ.50లక్షల విరాళాన్ని నేరుగా అమరావతిలో సీఎంను కలిసి అందజేయనున్నారు. టీడీపీ, తారక్ మధ్య కొన్నేళ్లుగా గ్యాప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కానుండడం ఆసక్తి నెలకొంది.

News September 13, 2024

శేఖర్ కమ్ముల, నాని కాంబోలో సినిమా?

image

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, నాని ఓకే చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని హిట్-3తో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు.

News September 13, 2024

చరిత్ర సృష్టించిన రొనాల్డో.. 100కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య

image

పోర్చుగీస్ ఫుట్‌బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ‘ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు.

News September 13, 2024

రైతు సమస్యలపై దీక్ష చేయాలని బీజేపీ నిర్ణయం

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఈనెల 20న లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్‌కు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

News September 13, 2024

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

image

AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్‌మెంట్ పరీక్షల్లో 90శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పబ్లిక్ పరీక్షలు కూడా CBSEలో రాసి ఫెయిలైతే విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News September 13, 2024

విజయవాడ రైల్వేస్టేషన్‌కు NSG-1 హోదా

image

AP:విజయవాడ రైల్వే‌స్టేషన్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. వార్షికాదాయం ₹500 కోట్లు అధిగమించి, NSG-1 హోదాను సాధించి దేశంలోని టాప్-28 స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. SCR పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన స్టేషన్‌గా నిలిచింది. ఏటా ₹500cr కంటే ఎక్కువ ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణించే స్టేషన్‌కు దక్కే ఈ హోదాను విజయవాడ గతంలో తృటిలో చేజార్చుకోగా, తాజాగా ₹528cr వార్షికాదాయం పొంది సాధించింది.

News September 13, 2024

నేనొక సీరియల్ డేటర్: రెజీనా

image

ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.

News September 13, 2024

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?

image

AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

News September 13, 2024

ALERT.. మళ్లీ వర్షాలు

image

AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.