India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ నెల 21న క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గొంటారని పేర్కొంది. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్లో జరిగే ఈ సదస్సులో క్వాడ్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఈ ఏడాది పవర్ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 192.32 స్ట్రైక్ రేట్తో 1,027 పరుగులు బాదారు. అతడి తర్వాత ఫిల్ సాల్ట్ (827), డుప్లెసిస్ (807), అలెక్స్ హేల్స్ (792), జేమ్స్ విన్స్ (703) ఉన్నారు. ఓవరాల్గా ఈ ఏడాది హెడ్ 181.36 స్ట్రైక్ రేట్తో 1,411 రన్స్ సాధించారు.
AP: వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం రానున్నారు. నియోజకవర్గంలోని మాధవపురం, రమణక్కపేటలో ప్రజలు, రైతులతో సమావేశమవుతారు. అలాగే ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమై నీటమునిగిన పొలాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.
సింగపూర్లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.
విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.
బంగ్లాదేశ్తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి U/A సర్టిఫికెట్ లభించినట్లు ‘బాలీవుడ్ హంగామా’ పేర్కొంది. 4 సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని తెలిపింది. ఓ పాత్ర తన భార్యను, మరో పాత్ర తన తల్లిని తన్నిన సీన్లను మూవీ టీం మార్చింది. ఇక కత్తిపై శరీరం వేలాడుతున్న ఓ సీన్ తొలగించారు. ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించిన సన్నివేశంలో అది CGI షార్క్ అన్న టిక్కర్ వేయాలని బోర్డు సూచించింది.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 ఆపివేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని YCP MP విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్లాంట్ను కాపాడడంలో CM చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ‘అందరూ భయపడినట్లే జరిగింది. బాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది తెలుగు జాతికి అతి పెద్ద ద్రోహం. దీనిని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని నేరం’ అని ఆయన ఎక్స్లో మండిపడ్డారు.
TG: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనను హత్య చేసేందుకు యత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ‘నాపై దాడికి వస్తుంటే గాంధీకే పోలీసులు రక్షణ కల్పించారు. నాకు రక్షణ కల్పించలేదు. ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఏం కల్పిస్తారు? రాక్షస పాలనపై మేం పోరాడుతూనే ఉంటాం. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.